తెగ‌ని పంచాయితీలు.. బుల్లెట్ డౌట్‌?

గోపీచంద్ – బి.గోపాల్ క‌ల‌యిక‌లో రూపుదిద్దుకొన్న చిత్రం ఆర‌డుగుల బుల్లెట్. ఈ చిత్రం శుక్ర‌వారం విడుద‌ల అవ్వాల్సింది. అయితే… అనుకొన్న‌ట్టుగా ఈ సినిమా విడుద‌ల అవుతుందా? లేదా? అనే విష‌యంపై ఇంకా క్లారిటీ రాలేదు. కొద్ది గంట‌ల్లో సినిమా విడుద‌ల అవ్వాల్సివుంది. అయితే… ఆర్థిక ప‌ర‌మైన ఇబ్బందుల దృష్ట్యా ఆర‌డుగుల బుల్లెట్ విడుద‌ల‌కు ఇంకా క్లియ‌రెన్స్ రాలేదు. ప్ర‌స్తుతం పీవీవీ సంస్థ‌… ఫైనాన్పియ‌ర్ల‌తో మీటింగ్ పెట్టింది. ‘మా డ‌బ్బులు ఇస్తే గానీ.. ఈ సినిమాని విడుద‌ల కానివ్వం’ అంటూ అప్పుల వాళ్లు గొడ‌వ చేస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే డ‌బ్బుల్ని తిరిగి ఇచ్చే ప‌రిస్థితిలో నిర్మాత లేడు. మ‌రోవైపు ఈ సినిమాకి సంబంధించిన ఆర్థిక ప‌ర‌మైన లావాదేవీల‌ను చూస్తున్న పీవీపీ కూడా చేతులు ఎత్తేసిన‌ట్టే క‌నిపిస్తోంద‌ని స‌మాచారం. ప‌రిస్థితి చూస్తుంటే… శుక్ర‌వారం ఈ సినిమా విడుద‌ల అవ్వ‌డం అనుమాన‌మే అని స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. రూ.6 కోట్లు అప్పు ఇచ్చిన ఎన్ ఆర్ ఐకి మాత్రం పీవీపీ కొంత మొత్తం ఇచ్చి కూల్ చేసిన‌ట్టు తెలుస్తోంది. మిగిలిన వాళ్లకు మాత్రం డ‌బ్బులు స‌ర్ద‌క‌పోవ‌డంతో.. బుల్లెట్ సినిమా ఆగిపోయే ప్ర‌మాదంలో చిక్కుకొంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close