టీజర్ టాక్ : ఫిదా

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా.. మలయాళ భామ సాయి పల్లవి హీరోయిన్ గా ఫిదా సినిమా తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి ఎట్టకేలకు ఓ టీజర్ వచ్చింది. శేఖర్ కమ్ముల మార్క్ తో మొదలైన టీజర్ చివర్లో ఆయన మార్కుకు కొంచెం భిన్నంగా ఎండ్ అయ్యింది.

టీజర్ ఓపెనింగ్ హీరోయిన్ సాయి పల్లవి డైలాగ్ తో మొదలయ్యింది. ”బద్మాస్ .. బలిసిందరా.. బొక్కలు ఇరగ్గొడతా” అంటూ తెలంగాణ యాసలో సాయి పల్లవి చెప్పిన డైలాగ్ ముచ్చటగా వుంది. వరుణ్ తేజ్ కూడా ఓ డైలాగ్ చెప్పాడు. ‘ఏం పిల్లరా.. వెళ్లట్లేదు మైండ్‌లో నుంచి. జీవితాంతం ఒకరితో ఉండాలనుకుంటున్నావు కదా.. తను ఈమే’ అంటూ స్లో మోషన్ లో శేఖర్ మార్క్ తో ఓ డైలాగ్ పలికాడు వరుణ్. అయితే ఫైనల్ టచ్ మాత్రం శేఖర్ మార్క్ కి భిన్నంగా వుంది. ఓ మంచు కొండలో హీరో హీరోయిన్ హాగ్ చేసుకున్న సీన్ కనిపించింది. జనరల్ గా శేఖర్ సినిమాల్లో కట్ చస్తే మంచుకొండల్లో డుయట్లు పాడటం లాంటివి వుండవు. మరి ఇది స్టోరీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిందా లేదా ఈసారి వరుణ్ వున్నాడు కదా అని ఓ డుయట్ ప్లాన్ చేసేరేమో చూడాలి.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రమిది. ఒక అమెరికా అబ్బాయికి, తెలంగాణ అమ్మాయికి మధ్య సాగే ప్రేమ కథ. జూలైలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క్రికెట్ మ్యాచ్‌లో ‘కుబేర‌’ స‌ర్‌ప్రైజ్‌

నాగార్జున మ‌న‌సు మ‌ల్టీస్టార‌ర్ల‌వైపు మ‌ళ్లింది. ఇప్పుడాయ‌న చేతిలో రెండు మ‌ల్టీస్టార‌ర్లు ఉన్నాయి. వాటిలో 'కుబేర‌' ఒక‌టి. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్ర‌మిది. ధ‌నుష్ క‌థానాయ‌కుడు. ఇందులో నాగార్జున కీల‌క పాత్ర పోషిస్తున్న...

ఎక్స్‌క్లూజీవ్‌: బెల్లంకొండ‌తో సంయుక్త‌

బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా మూన్ షైన్ పిక్చ‌ర్స్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో లుధీర్ బైరెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారు. బెల్లంకొండ -...

మ‌హేష్‌, ఎన్టీఆర్ చిత్రాల‌పై క్లారిటీ!

ఈ యేడాది టాలీవుడ్ లో భారీ, క్రేజీ చిత్రాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటిలో మ‌హేష్ - రాజ‌మౌళి, ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ చిత్రాలు ముందు వ‌రుస‌లో ఉన్నాయి. 'గుంటూరు కారం' పూర్త‌యిన...

కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని ఫోటో మాయం..కారణం అదేనా..?

ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమవ్వడం చర్చనీయాంశం అవుతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close