ఎర్రబెల్లికి రెండు వారాలు రిమాండ్, తెరాస మాష్టర్ ప్లాన్?

నాలుగు రోజుల క్రితం వరంగల్ జిల్లాలోని పాలకుర్తి మార్కెట్ యార్డు భవన శంఖుస్థాపన సమయంలో తెదేపా, తెరాస నేతల మధ్య జరిగిన ఘర్షణలో తెదేపా శాసనసభ పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావుతో సహా మరో 17మంది తెదేపా నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేసి ఈరోజు జనగామ కోర్టు ముందు ప్రవేశపెట్టగా కోర్టు వారందరికీ రెండు వారాల జ్యూడిషియల్ కస్టడీ విధించింది. వారందరినీ పోలీసులు జైలుకి తరలిస్తున్నారు. ఈ సందర్భంగా జనగామలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి.

ఇది పైకి చాలా సాదారణమయిన వ్యవహారంలాగ కనిపిస్తున్నప్పటికీ, రేపటి నుండి తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు మొదలవబోతున్నందున తెలంగాణా ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే తెదేపా శాసనసభ పక్ష నేత అయిన ఎర్రబెల్లిని అరెస్ట్ చేసి జైలుకి పంపించినట్లు తెలంగాణా తెదేపా నేతలు అనుమానిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణాలో రైతుల ఆత్మహత్యల గురించి శాసనసభలో తెరాస ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తానని ఎర్రబెల్లి ముందే హెచ్చరించారు. మిగిలిన ఏ సమస్యలపైనయినా తెరాస మంత్రులు, ముఖ్యమంత్రి కేసీఆర్ చాల అలవోకగా జవాబులు చెప్పగలరు. కానీ రైతుల ఆత్మహత్యలపై ప్రతిపక్షాల నోళ్ళు మూయించడం అంత సులభం కాదు. అధికారంలోకి వచ్చిన కొత్తలో రైతుల ఆత్మహత్యలకు గత ప్రభుత్వాలే కారణమని నిందిస్తూ తప్పించుకొనే అవకాశం ఉండేది. కానీ 14నెలల తరువాత కూడా అదే పాట పాడితే ప్రతిపక్షాలే కాదు ప్రజలు కూడా అంగీకరించరు. కనుక ఈ సమస్యపై ప్రభుత్వాన్ని శాసనసభలో గట్టిగా నిలదీయలనుకొంటున్న ఎర్రబెల్లి తనంతట తానుగా వచ్చి ఉచ్చులో ఇరుక్కోవడంతో అదే అదునుగా ఆయనని అరెస్ట్ చేసి లోపలేసి చేతులు దులుపుకొంది. ఒకవేళ ఎర్రబెల్లికి హైకోర్టు బెయిలు ఇస్తే తెరాసకు శాసనసభలో ఆయన్ని ఎదుర్కోక తప్పదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close