బీహార్ బీజేపీ విజన్ లో ఆచితూచి హామీలు

వెనకబడ్డ బీహార్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తన ప్రణాళిక ఏమిటో బీజేపీ వివరించింది. విజన్ డాక్యుమెంట్ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. పాట్నాలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో విడుదల చేసిన ఈ డాక్యుమెంటు లోని అంశాలను పరిశీలిస్తే, ప్రజలకు హామీలిస్తూనే, మరీ అడ్డగోలు ఉచిత వాగ్దానాలు చేయకుండా జాగ్రత్త పడిందని అర్థమవుతుంది. అభివృద్ధికి అవసరమైన నిర్మాణాత్మక కృషి చేయడం, యువతకు ప్రాధాన్యం, రైతులకు ఊరటనిచ్చే హామీలు ముఖ్యాంశాలుగా కనిపిస్తాయి. ముఖ్యంగా, రైతులకు వడ్డీలేని రుణం ఇస్తామనే హామీ కీలకమైంది. రైతు ఆత్మహత్యలు ఆగాలంటే వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ఇటీవల సామాజిక కార్యకర్త అన్నా హజారే సూచించారు. ఇంకా ఎంతో మంది ఇలాంటి సలహానే ఇచ్చారు. బీజేపీ సరిగ్గా అదే చేస్తామని హామీ ఇచ్చింది. వ్యవసాయం, అనుబంధ అవసరాల కోసం రోజులో 12 గంటల పాటు విద్యుత్తు సరఫరా చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. వ్యవసాయానికి సంబంధించి మరికొన్ని హామీలనూ డాక్యుమెంటులో పొందుపరిచారు.

యువతపై ఫోకస్ చేస్తూ, పది, పన్నెండో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ ఇస్తామని ప్రకటించారు. ఇలా ఏటా దాదాపు 50 వేల మందికి పంపిణీ చేస్తారట. అలాగే ఏటా దాదాపు 5 వేల మంది బాలికలకు టూవీలర్లు ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. 10, 12 వ తరగతిలో ప్రతిభ ఆధారంగా వీటిని పంపిణీ చేస్తారు. విద్యార్థులకు విద్యా రుణాలను 3 శాతం వడ్డీకే అందజేస్తారు. వృత్తి విద్యో కోర్సుల్లో చేరిన వారికి స్కాలర్ షిప్ లు, ఇంకా ఇతర హామీలు అదనం. రాష్ట్రంలో భూమిలేని పేదలకు భూమి పంపిణీ చేయడం, ఇంటి నిర్మాణానికి సహాయం చేయడం వంటి హామీలూ ఉన్నాయి. దళితులు, మహా దళితులకు ఉచితంగా కలర్ టీవీలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇది తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రాచుర్యం పొందిన పథకం.

బీజేపీ డాక్యుమెంటులో ప్రజలకు మేలు చేసే పనులపై హామీలు ఇవ్వడమే కాదు, వారు బాధ్యతగా వ్యవహరించేలా చూసే ప్రయత్నం జరిగింది. ప్రభుత్వ సంస్థల నుంచి ఎవరికైనా రుణం కావాలంటే, వారి ఇంట్లో తప్పనిసరిగా టాయిలెట్ ఉండి తీరాలి. అలాగే లాప్ టాప్ లు, టూవీలర్లను ఎవరికి పడితే వారికి, లేదా కులాల ఆధారంగా కాకుండా ప్రతిభ ఆధారంగా ఇస్తామనడం కూడా బాధ్యతతో కూడిన హామీనే. విద్యార్థులు శ్రద్ధగా చదవడానికి ఇది ప్రేరణనిస్తుంది. తద్వారా వారి మంచి భవిష్యత్తుకు పునాది పడే అవకాశం ఉంది.

బీజేపీ హామీల్లో ఎక్కడా ఆచరణ సాధ్యం కాదని ఉచితాలు, లేదా ఫ్రీబీస్ హామీలు లేవు. రైతులకు వడ్డీలేని రుణం ఇస్తామన్నారే తప్ప, రుణాల మాఫీ హామీ ఇవ్వలేదు. రుణ మాఫీ సరైన విధానం కాదని రిజర్వ్ బ్యాంకే కాదు, అన్నా హజారే వంటి వారూ చెప్పారు. అందుకే, బీజేపీ తార్కికంగా ఆలోచించి హామీలిచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close