కొడాలి నాని అరెస్ట్: వల్లభనేని వంశీకి ఫస్ట్ ర్యాంక్

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని గుడివాడ పోలీసులు ఇవాళ ఉదయం అరెస్ట్ చేశారు. గుడివాడ వైసీపీ పార్టీ కార్యాలయం ఉన్న భవనం యజమాని సుశీల ఫిర్యాదు మేరకు ఈ అరెస్ట్ జరిగింది. తన భవనంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయమని కొంతకాలంగా చెబుతూ వస్తున్నానని, అయితే ఆ పార్టీ నేత కొడాలి నాని పట్టించుకోవటం లేదని సుశీల ఆరోపిస్తున్నారు. ఇవాళ ఉదయం ఆమె తన భవనానికి తాళం వేసి ధర్నాకు కూర్చున్నారు. దీంతో వైసీపీ కార్యాలయంవద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సుశీల ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడ మోహరించారు. అక్కడికొచ్చిన నాని, తమకు చెప్పకుండా భవనానికి తాళం ఎలా వేస్తారని పోలీసులను ప్రశ్నించారు. భవన యజమాని కమ్మవారని, ఆమె చంద్రబాబు నాయుడు భార్యకు వెళ్ళి చెప్పటంతో, ఆమె పోలీసులను పంపారని, తనకంతా తెలుసని ఆరోపించారు. నానికి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు నానిని అరెస్ట్ చేసి ముదినేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఇదిలా ఉంటే, కొడాలినానికి మిత్రుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ – పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేయించిన సర్వేలో కృష్ణాజిల్లాలో ప్రధమ స్థానంలో నిలిచారు. మంత్రి కొల్లు రవీంద్ర రెండో ర్యాంక్, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మూడో ర్యాంక్ దక్కించుకున్నారు. గతంలో విజయవాడలో రాష్ట్ర పార్టీ సమావేశం జరిగినపుడు ర్యాంకులు ఇచ్చినపుడు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య)కు మొదటి ర్యాంక్ వచ్చింది. అయితే ఈ సారి ఆయన తన ర్యాంక్ వెల్లడించటానికి సుముఖత చూపటంలేదు. జన్మభూమి, పేదలకు ఇళ్ళు మంజూరు వంటి పథకాల అమలు, తదితర 20 అంశాలపై చేయించిన సర్వే ఆధారంగా ఈ ర్యాంకింగ్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close