తెరాస నేతలను విడిచిపెట్టిన మావోలు

రెండు రోజుల క్రితం ఖమ్మం జిల్లాకు చెందిన తెరాస నేతలు-రామకృష్ణ, పటేల్ వెంకటేశ్వర్లు, పంతమూరు సురేష్, రెప్పకట్ల జానర్దన్, సత్యనారాయణ, ఊకే రామకృష్ణలను అపహరించుకుపోయిన మావోయిష్టులు వారికి ఎటువంటి హానీ చేయకుండా ఈరోజు తెల్లవారు జామున జిల్లాలోని చర్ల అటవీ ప్రాంతంలో తీసుకువచ్చి వదిలేశారు. మావోయిష్టులు అజెండా అమలు చేస్తామని చెప్పిన తెరాస అధ్యక్షుడు కేసీఆర్, ముఖ్యమంత్రి అయిన తరువాత మావోయిష్టులను భూటకపు ఎన్కౌంటర్లు చేయిస్తూ బంగారి తెలంగాణాకు బదులు మావోల రక్తంతో నెత్తుటి తెలంగాణాని ఏర్పాటుచేసారని, ఆయన ప్రభుత్వానికి హెచ్చరించడానికే తాము తెరాస నేతలను బందీలుగా పట్టుకొన్నామని మావోయిష్టుల నేత జగన్ బందీలుగా చిక్కినవారికి చెప్పారు. కనుక ఇకనయినా ముఖ్యమంత్రి కేసీఆర్ తన తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. తమను పట్టుకొనేందుకు అడవులలో కొనసాగుతున్న పోలీస్ కూంబింగ్ తక్షణమే నిలిపి వేయాలని, అలాగే మావోలను భూటకపు ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని తెరాస నేతల ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ కి వర్తమానం పంపించారు. లేకుంటే మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెరాస నేతలపై దాడులు చేసి హతమారుస్తామని జగన్ తమను హెచ్చరించినట్లు విడుదలయిన తెరాస నేతలు చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close