ఉప ఎన్నికలలో తెరాసకు మంచి ఆయుధమే దొరికింది

ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాలలో నిరుపేదల కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకంలో భాగంగా సుమారు 2.23లక్షల ఇళ్ళు కేటాయించింది. వాటిలో సుమారు 1.93లక్షల ఇళ్ళను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, 10, 000 ఇళ్ళను తెలంగాణా రాష్ట్రానికి మిగిలిన ఇళ్ళను గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాలకు కేటాయించింది. ఆంధ్రాకు సుమారు 85 శాతం ఇళ్ళు కేటాయించబడితే, తెలంగాణాకు కేవలం 10 శాతం ఇళ్ళు మాత్రమే మంజూరు అవడంతో తెరాస నేతలు కేంద్రప్రభుత్వం విమర్శలు గుప్పిస్తున్నారు. సరిగ్గా వరంగల్ ఉప ఎన్నికల ముందు, కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఈ ఎన్నికలలో బీజేపీని దెబ్బ తీసేందుకు తెరాసకు అదొక మంచి ఆయుధంగా లభించింది.

తెలంగాణా రాష్ట్రం పట్ల కేంద్రప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మొదటి నుండి ఆరోపిస్తున్న తెరాస నేతలకు సరిగ్గా ఉప ఎన్నికల ముందు అందివచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని బీజేపీపై, కేంద్రప్రభుత్వం విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. తెలంగాణాకు కేంద్రప్రభుత్వం ఎప్పుడూ మొండి చెయ్యి చూపిస్తూనే ఉందని మళ్ళీ ఈ ఇళ్ళ కేటాయింపులో కూడా అలాగే చేసిందని నిజామాబాద్ తెరాస ఎంపి కవిత విమర్శించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆంధ్రాకు చెందినవారయినప్పటికీ తెలంగాణా పట్ల మరీ ఇంత వివక్ష చూపడం సమంజసంగా లేదని ఆమె అన్నారు. తన నిజామాబాద్ నియోజక వర్గం ఒక్కదానికే సుమారు 75,000 ఇళ్ళు అవసరం ఉండగా, కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 10,000 రాష్ట్రం మొత్తానికి ఏవిధంగా సరిపోతాయని ఆమె ప్రశ్నించారు.

కేంద్రప్రభుత్వం తెలంగాణా రాష్ట్రానికి చాలా అన్యాయం చేస్తోందని, తాము పంపిన ప్రతిపాదనలను వేటినీ పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి తాము పంపిన ప్రతిపాదనలపై కేంద్రప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదని ఆమె ఆరోపించారు. పార్లమెంటు సమావేశాలలో ఈ అంశంపై కేంద్రప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆమె అన్నారు. వరంగల్ ఉప ఎన్నికలకు పోలింగ్ ఈరోజు జరుగుతున్నందున, ఓటర్లపై తెరాస నేతలు చేస్తున్న ఈ విమర్శల ప్రభావం చూపే అవకాశం ఉంది. అదే జరిగితే బీజేపీ అభ్యర్ధి డా. దేవయ్య నష్టపోవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close