జయలలితను మోడీ ప్రసన్నం చేసుకోగలరా?

తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల వచ్చిన తుఫాను వలన సుమారు రూ. 8,500 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. దానిపై స్పందించిన కేంద్రప్రభుత్వం తక్షణమే రూ. 940 కోట్లు విడుదల చేసింది. అంతే కాదు ముఖ్యమంత్రి జయలలిత అభ్యర్ధన మేరకు తుఫాను నష్టాన్ని అంచనా వేయడానికి 9మంది సభ్యులతో కూడిన కేంద్ర పరిశీలన బృందం ఒకటి నేడు తమిళనాడుకి పంపించింది. తుఫాను వల్ల నష్టపోయిన చెన్నై, కాంచీపురం, తిరువళ్లూర్, కడలూరు ప్రాంతాలలో వారు రెండు రోజుల పాటు పర్యటించి తుఫాను నష్టాన్ని స్వయంగా అంచనా వేసి కేంద్రానికి నివేదిక సమర్పిస్తారు. దానిని బట్టి కేంద్రప్రభుత్వం అవసరమయితే తమిళనాడు రాష్ట్రానికి మరిన్ని నిధులు విడుదల చేయవచ్చును.

కేంద్రప్రభుత్వం ఇంత చురుకుగా సానుకూలంగా స్పందించడం చాలా హర్షణీయం. కానీ ఇదే చురుకుదనం, సానుకూల స్పందన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హుదూద్ తుఫాన్ ఏర్పడినప్పుడు ఎందుకు చూపించలేదు? అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తే ఆశ్చర్యం లేదు. హుదూద్ తుఫాను తగ్గిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడి స్వయంగా తుఫాను నష్టాన్ని పరిశీలించేందుకు విశాఖకు వచ్చి, రూ.1, 000 కోట్లు ఆర్ధిక సహాయం ప్రకటించినప్పుడు రాష్ట్ర ప్రజలందరూ చాలా సంతోషించారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీ చుట్టూ ఆరు నెలలు తిరిగితే కానీ ఆ డబ్బు విడుదల చేయలేదు? అది కూడా రెండు వాయిదాలలో విడుదల చేసారు! తెదేపా-బీజేపీలు మిత్రపక్షాలుగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా ఉన్నప్పుడు, అంతకంటే పెద్ద మొత్తం తక్షణమే విడుదల చేస్తారని అందరూ ఆశించారు. కానీ ప్రధాని స్వయంగా ప్రకటించిన ఆ మొత్తం విడుదల చేయడానికే ఆరు నెలల సమయం పట్టింది! తమిళనాడు రాష్ట్రానికి సహాయం చేయడం చాలా అత్యవసరం. వీలయినంత ఎక్కువ సహాయం చేయాలనే ఎవరయినా కోరుకొంటారు. కానీ బీజేపీ భాస్వామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల కేంద్రం ఈవిధంగా వ్యవహరిస్తుండటాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

బిహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని నరేంద్ర మోడి ఆ రాష్ట్రానికి ఎవరూ అడగకపోయినా రూ.1.65లక్షల కోట్ల భారీ ఆర్దికప్యాకేజి ప్రకటించినందున, వచ్చే ఏడాది తమిళనాడులో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే అధికార అన్నా డి.ఎం.కె. అధినేత్రి జయలలితను ప్రసన్నం చేసుకోవడానికే కేంద్రం ఇంత చురుకుగా, సానుకూలంగా వ్యవహరిస్తోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జయలలితను ప్రసన్నం అయితే ఆమె బీజేపీకి మహా అయితే కొన్ని ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయించవచ్చును తప్ప బీజేపీ ఎన్ని విశ్వప్రయత్నాలు చేసినా తమిళనాడులో బలమయిన రాజకీయ శక్తిగా ఎదగడం చాలా కష్టమనే భావించవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close