ఆత్మకూరు బరిలో ఆనం కుమర్తె !

ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల్ వచ్చిన సందర్భంలో ఆసక్తికరంగా పరిణామాలు మారుతున్నాయి. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ కుమార్తె కైవల్యారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆమె తన భర్తతో కలిసి లోకేష్‌తో భేటీ అయ్యారు. వారు పార్టీలో చేరేందుకు ఆత్మకూరు సీటును అడిగినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆత్మకూరులో టీడీపీకి బలమైన నేత లేరు . దీంతో టీడీపీ కూడా అంగీకరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఆత్మకూరు నియోజకవర్గానికి గతంలో ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహించేవారు. కంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అయితే వైసీపీలో చేరడంతో ఆయనకు ఆత్మకూరు దక్కలేదు. వెంకటగిరి ఇచ్చారు. అక్కడ్నుంచి ఆయన విజయం సాధించారు. అయితే ఈ సారి ఆయనకు టిక్కెట్ డౌటేనని ప్రచారం జరుగుతోంది. అక్కడ నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడ్ని జగన్ ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో ఆనం ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారు. ఇప్పుడు కుమార్తెను వ్యూహాత్మకంగా టీడీపీలోకి పంపి ఆత్మకూరుపై గురి పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఆనం కుమార్తె ఆయన అనుమతి లేకుండా టీడీపీలో చేరే అవకాశం ఉండదని భావిస్తున్నారు. మరో వైపు ఆత్మకూరుపై ఆనం ఫ్యామిలీ దృష్టి పెట్టినా ఉపఎన్నికల్లో మాత్రం కాదని అంటున్నారు. ముందస్తు ఎన్నికలు ఉంటాయని ప్రచారం జరుగుతున్న సమయంలో కొద్ది కాలం కోసం ఎన్నికల్లో పోటీ చేయడం దండగన్న అభిప్రాయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఉపఎన్నికల్లో కాదని… నేరుగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కైవల్యా రెడ్డి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దూరదర్శన్ లోగో కలర్ మార్పు… కారణం అదేనా..?

దూరదర్శన్... చాలా ఫేమస్ ఛానెల్. అప్పట్లో ఎక్కడ చూసినా దూరదర్శన్ ప్రసారాలే.అందుకే దూరదర్శన్ ఛానెల్ కు ఇప్పటికీ అసంఖ్యాకమైన ప్రేక్షకులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా, సడెన్ గా దూరదర్శన్ లోగో కలర్...

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close