పంజాబీ పంజా : పూనం కౌర్ తో గేమ్ మొదలెట్టిన ఏబీఎన్

పూనం కౌర్ – తను హీరోయిన్ గా ఉన్నప్పుడు కంటే ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అవుతోంది. ఆమధ్య పవన్ కళ్యాణ్ తో పూనం కౌర్ ని జత కలుపుతూ కత్తి మహేష్ ఆరోపణలు చేయడంతో పూనం కౌర్ పై ఒక్కసారిగా మీడియా ఆసక్తి పెరిగింది. అయితే ఇటీవలే ఎబిఎన్ ఛానల్ ఒక ట్రైలర్ విడుదల చేసింది. పంజాబీ పంజా పేరుతో విడుదలైన ఈ వీడియో ట్రైలర్ చూస్తుంటే పూనం కౌర్ తో ఎబిఎన్ ఛానల్ ఇంటర్వ్యూ సిరీస్ ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. “ప్రశ్నించడం మొదలైంది ” అన్న వాక్యంతో ఈ ట్రైలర్ ముగించడం చూస్తుంటే పూనం కౌర్ తో పవన్ పై గేమ్ ఏబీఎన్ మొదలెట్టిందా అన్న సందేహం కలగడం ఖాయం.

మొత్తానికి పూనం కౌర్ ఇంటర్వ్యూ సిరీస్ రావడం ఖాయమైంది. అందులోనూ తెలుగుదేశం పార్టీ అనుకూల ముద్ర కలిగిన ఏబీఎన్ ఛానల్లో ప్రోగ్రాం రానుండడంతో ఎటువంటి సంచలనాలకు తెరలేవనుందో అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ” తుఫాను ముందు ప్రశాంతత”, “సమయం కోసం వేచిన సమరం “, “ప్రశ్నించడం మొదలైంది” లాంటి వాయిస్ ఓవర్ వాక్యాలతో ట్రైలర్ ఇవ్వడం చూస్తుంటే కాస్త ‘గట్టిగానే’ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ ఇంటర్వ్యూ సిరీస్ తర్వాత పవన్ డిఫెన్స్లో పడటం ఖాయమని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు

అయితే మరికొందరు మాత్రం ఇలాంటి వాటివల్ల జనసేన కు కానీ పవన్ కు గానీ నష్టం ఏమీ ఉండదని, 2009లో అంటే దాదాపు పదేళ్ల క్రింద ఇలాంటి వ్యూహాలు ఫలించాయి ఏమో కానీ సోషల్ మీడియా విస్తృతి పెరిగిన ఈ కాలంలో ఇవి కష్టమేనని వీరు భావిస్తున్నారు. ఏదిఏమైనా- ఇంటర్వ్యూ ప్రసారమైన తర్వాత , కొన్ని సంచలన వ్యాఖ్యలు, వాటికి కౌంటర్లు, మళ్లీ వాటిపై డిబేట్ లు మాత్రం ఖచ్చితంగా ఉంటాయని ఊహించవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.