“ప్రత్యేక హోదా” అంశాన్ని మెల్లగా పైకి తెస్తున్న సీఎం జగన్..!

ప్రత్యేకహోదా అంశాన్ని లైవ్‌లోనే ఉంచాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అధికారం చేపట్టిన మొదట్లో ఆయన ప్రత్యేకహోదా గురించి మాట్లాడేవారు. అయితే.. అప్పట్లో బీజేపీ నాయకుల నుంచి తీవ్రమైన హెచ్చరికలు వచ్చాయి. హోదా గురించి ప్రజల్ని మభ్య పెడుతున్నారని .. హోదా ఇచ్చే అవకాశమే లేదని తేల్చేసినా… కేంద్రంపై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఆ తర్వాత బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఏర్పడటంతో.. ఆయన హోదా గురించి ప్రస్తావించడం మర్చిపోయారు. అయితే.. హఠాత్తుగా… హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో హోదా అంశాన్ని ప్రస్తావించారు. ప్రత్యేకహోదా ఇవ్వకపోతే… విభజన చట్టం అమలు చేసినట్లు కాదని తేల్చేశారు.

ఆ తర్వాత ఇండిపెండెన్స్ డే వేడుకల్లోనూ హోదా అంశాన్ని ప్రస్తావించారు. కేంద్రాన్ని ఇచ్చే వరకూ అడుగుతూనే ఉంటామని చెప్పుకొచ్చారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కేంద్రానికి మన ఎంపీల అవసరం ఉంటేనే ఇస్తుందని లేకపోతే ఇవ్వదని.. ఏపీపై… ఢిల్లీకి పెద్దగా కన్సర్న్ లేదనే అంశాన్ని ప్రజల్లోకి చొప్పిస్తేనే.. అవసరం వచ్చేంత బలం తనకు ఉండాలని ఆయనకు ప్రజలకు సందేశం ఇస్తున్నారు. ఎప్పుడైతే.. కేంద్రం తన డిమాండ్లు.. కోరికల విషయంలో … వ్యతిరేకంగా వ్యవహరిస్తుందో.. అప్పుడు హోదా అంశాన్ని మళ్లీ ఉద్యమంగా మార్చడానికి అవసరమైన గ్రౌండ్‌ను ఆయన ఈ విధంగా సిద్ధం చేసుకుంటున్నారని రాజకీయవర్గాలకు సులువుగానే అర్థం అవుతోంది.

ప్రస్తుతానికి కేంద్రంతో జగన్‌కు జగడం అవసరం లేదు. వీలైనంత వరకూ సహకరిస్తున్నారు. గవర్నర్ కూడా.. వివాదాస్పద బిల్లులు అనుకున్న వాటికీ సంతకాలు పెడుతున్నారు. అవి మధ్యలో ఆగిపోయినా… కోర్టులు కొట్టి వేసినా ఆయన లైట్ తీసుకుంటున్నారు. జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి అడ్డుపడబోమని కేంద్రం ఇప్పటికే బలమైన సంకేతాలు పంపింది. అయితే.. రాజకీయాల్లో ఎప్పుడూ ఒకరి అవసరం ఒకరికి ఉంటేనే మిత్రత్వం సాగుతుంది. ఈ విషయం తెలుసు కాబట్టే.. జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా హోదా అంశాన్ని లైవ్‌లో ఉంచి.. బీజేపీని ఇరుకున పెట్టడానికి ఓ చాన్స్‌ను దగ్గర పెట్టుకుంటున్నట్లుగా భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

టీఆర్ఎస్ ఎక్కడుంది ? ఇప్పుడున్నది బీఆర్ఎస్‌ !

టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్నే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంగా చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఎన్నికల హడావుడిలో ఉన్నందున పెద్దగా కార్యక్రమాలేమీ వద్దని పార్టీ కార్యాలయాల్లో జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు....

మేనిఫెస్టో మోసాలు : ఎలా చనిపోయినా రూ.లక్ష ఇస్తానన్నారే – గుర్తు రాలేదా ?

తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రన్న బీమా అనే పథకం ఉండేది. సహజ మరణం కూడా రూ. 30వేలు, ప్రమాద మరణానికి రూ. 2 లక్షలు ఇచ్చేవారు. వారికి వీరికి అని...

షర్మిల రాజకీయానికి జగన్ బెదురుతున్నారా..?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలపై జగన్ రెడ్డి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మరుసటి రోజే షర్మిలకు పోలీసులు అడ్డంకులు సృష్టించారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close