ఆ ప‌త్రిక‌పై బ‌న్నీ గుస్సా…??

డీజే విడుద‌ల‌కు రెడీ అయిపోయింది. ఆడియో ఫంక్ష‌న్ త‌ప్ప‌…. ప‌బ్లిసిటీ మొద‌ల‌వ్వ‌లేదు. సాధార‌ణంగా ప‌బ్లిసిటీ విష‌యంలో కేర్ తీసుకొనే అల్లు అర్జున్‌… ఆ దిశ‌గా ఇంకా దృష్టి సారించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఈసారి.. మీడియా ఇంట‌ర్వ్యూలు త‌గ్గిద్దాం.. అంటున్నాడ‌ట‌. దానికి కార‌ణం… ‘చెప్ప‌ను బ్ర‌ద‌ర్‌’ ఉదంత‌మే. స‌రైనోడు స‌క్సెస్ త‌ర‌వాత ఓ ప్ర‌ధాన తెలుగు దిన ప‌త్రిక‌కు ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు బ‌న్నీ. అందులో మ‌రోసారి ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ప్ర‌శ్న‌కు స్పందిస్తూ… ‘చెప్ప‌ను బ్ర‌ద‌ర్‌’ అనేశాడు. దాంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ లో మళ్లీ క‌ల‌క‌లం రేగింది. అప్ప‌ట్నుంచి దిన పత్రిక‌ల ఇంట‌ర్వ్యూ లంటే కాస్త ఇబ్బంది ప‌డుతున్నాడ‌ట బ‌న్నీ. బ‌న్నీ ఆలోచ‌న‌లు చూస్తుంటే ఈసారి మీడియాకు, అందులోనూ దిన ప‌త్రిక‌ల‌కు కాస్త దూరంగా ఉండే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు అంటున్నాయి. బ‌న్నీని కాస్త కూల్ చేసి… ఇంట‌ర్వ్యూల‌కు ఒప్పించాల‌ని దిల్‌రాజు పీఆర్వోలు గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అన్న‌ట్టు ఈ సినిమాని రెండు ఏరియాల్లో గీతా ఆర్ట్స్ సొంతంగా విడుద‌ల చేస్తోంది. ఆ ర‌కంగా బ‌న్నీ సొంత సినిమా ఇది. ఆ కార‌ణం చూపించైనా.. బ‌న్నీని ప‌బ్లిసిటీ కోసం ఒప్పించాల‌ని దిల్‌రాజు ప్ర‌య‌త్నిస్తున్నార్ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.