వైసీపీలోకి త్రిమూర్తులు..! కాపు నేతల చేరికలకు “ఆమంచి” నేతృత్వం..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తోట త్రిమూర్తులు చేరారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి…  వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చేతిలో పరాజయం పాలయ్యారు. ఎన్నికలకు ముందే ఆయనకు.. వైసీపీ తరపున ఆఫర్ వచ్చింది. వ్యాపార, ఆప్తమిత్రులైన ఆమంచి, ఆవంతి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు గట్టిగానే రాయబారం చేశారు. అయితే.. అప్పట్లో తన కుమారుడికి రాజమండ్రి సీటు, తనకు రామచంద్రాపురం సీటు కావాలని.. పట్టుబట్టడంతో.. జగన్మోహన్ రెడ్డి తిరస్కరించారు. దాంతో ఆయన టీడీపీ తరపునే ఎన్నికల్లో పోటీ చేశారు. ఓటమి తర్వాత ఆయన … అప్పటి వరకూ ఉన్న టీడీపీలో ఉండలేకపోయారు. పాత మిత్రులతో మార్గం సుగమం చేసుకోవడంతో… వైసీపీలో చేరిపోయారు.

టీడీపీ, జనసేనల్లోని కాపు నేతలను… వైసీపీలో చేర్చుకునే ఆపరేషన్‌ను… ఆ పార్టీ నేతలు ప్రారంభించారని.. విజయసాయిరెడ్డి తన మాటల ద్వారా చెప్పకనే చెప్పారు. ఆపరేషన్ ఆమంచి… అంటూ… తోట త్రిమూర్తులు చేరిక తర్వాత చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమంటున్నారు. రాబోయే రోజుల్లో… ఎంతో మంది కాపు నేతలు… తమ పార్టీలోకి వస్తారని అంటున్నారు. తోట త్రిమూర్తులు చేరిక సమయంలో…ఆమంచినే కీలకంగా వ్యవహరించారు. రామచంద్రాపురంలో ప్రస్తుత ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల్, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ .. రెండు వర్గాలుగా ఉన్నారు. ఇప్పుడు… తోట త్రిమూర్తులు చేరికతో మూడో వర్గం అయినట్లయింది.

కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇచ్చేది లేదని ప్రకటించినా.. వైసీపీలోని కాపు నేతలు నోరు మెదపడం లేదని.. వారికి జగన్ అంటే భయం అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలకు సూటిగానే తగిలాయి. పవన్ కల్యాణ్ ఆ వ్యాఖ్యలు వెక్కి తీసుకోవాలని ఆమంచి డిమాండ్ చేశారు. కాపులే కాకుండా.. అన్ని వర్గాల వారు… వైసీపీలో చేరుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. తోట త్రిమూర్తులు మాత్రం.. పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేయడానికి సందేహించారు. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడటానికి ఏమీ లేదని తప్పించుకున్నారు. మొత్తానికి పవన్ కల్యాణ‌్ పై.. కాపు నాయకులతో… వైసీపీ గట్టిగానే ఎదురు దాడి చేయిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close