ఏపీ పోలింగ్‌కు ఇంకా 2 నెలలు – ఎవరికి గండం ?

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ మొదటి విడతలోనే పూర్తయిపోతుందని అనుకున్న వారికి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఈ సారి నాలుగో విడతకు మార్చింది. మొత్తం ఏడు విడతలుగా జరగనున్న ఎన్నికల్లో నాలుగో విడతలో ఏపీ, తెలంగాణల్లో పోలింగ్ జరగనుంది. గతంలో మొదటి విడతలోనే పూర్తయిపోయింది. నాలుగో విడతకు మార్చడం వల్ల రాజకీయ పార్టీలకు మరింత ఎక్కువ ఖర్చు కానుంది. ఎన్నికలషెడ్యూల్ ప్రకటించిన వెంటనే కోడ్ అమల్లోకి వచ్చింది. అంటే ప్రభుత్వం ఇక ఆపద్దర్మం కిందకే వస్తుంది.

ఏపీలో మే 13 న ఎన్నికల పోలింగ్ జరగనుండగా జూన్ 4 న కౌంటింగ్ జరగనుంది. ఏప్రిల్ 18న అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 15 చివరి తేదీగా నిర్ణయించారు. 26 ఏప్రిల్ న నామినేషన్ల స్క్రూనిటీ జరగనుంది. అభ్యర్థుల ఉపసంహరణకు గడువు ఏప్రిల్ 29గా ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలకూ ఒకేసారి పోలింగ్ జరుగుతుంది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఈ కోడ్ వర్తించనుంది. రాజకీయ పార్టీలు, నేతలు ఎలక్షన్ కోడ్ ను తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది

ఇప్పటి నుంచి చూస్తే పోలింగ్ కు ఇంకా రెండు నెలల గడువు ఉంది. ఈ సమయంలో ప్రభుత్వంపై అసంతృప్తి మరింత పెరగకుండా చూసుకోవాల్సి ఉంది. ఇప్పటికే బటన్ నొక్కిన డబ్బుల్ని అకౌంట్లలో జమ చేయలేకపోతున్నారు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నందున బ్యాంకులు ఆర్థిక సంస్థలు అప్పులు కూడా ఇవ్వవు. ఆర్బీఐ కూడా ఇవ్వకపోవచ్చు. ఈ క్రమంలో .. వచ్చే రెండు నెలలు ప్రభుత్వానికి పెను సవాల్ లాంటిదే అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close