అసెంబ్లీలో రాజకీయ “కరువు”..!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో కరువుపై చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు కారణం మీరంటే.. మీరని ఆరోపణలు చేసుకున్నాయి. రుణమాఫీపై చర్చించారు. వడ్డీ లేని రుణాలపై చర్చించారు. విత్తనకష్టాలపై చర్చించారు. వర్షాల లోటుపై కూడా చర్చించారు. కానీ.. అంతా జరిగిన ఓ లోటు కనిపించింది. ఎక్కడా ఈ కరువు కాలంలో రైతులు ఏం సాయం చేయాలన్నదానిపై చర్చ జరగలేదు. గత ప్రభుత్వం వైఫల్యాలను… అధికారపక్షం ఏకరువు పెట్టింది. సమస్యలు పరిష్కరించడం చేతకాకే.. తమపై నిందలేస్తున్నారని.. విపక్షం కౌంటర్ ఇచ్చింది. ఇక రైతులకు ఏర్పడిన విత్తన సంక్షోభంపై.. కూడా అసెంబ్లీలో చర్చించారు. గత ప్రభుత్వానికి ప్రణాళిక లేకపోవడం వల్లే ఇప్పుడు రైతులకు కష్టాలని అధికారపక్షం విమర్శలు గుప్పిస్తే… విత్తనాలే ఇవ్వలేకపోతున్నారు.. ఐదేళ్లు ఏం పరిపాలిస్తారని.. విపక్షం ఎద్దేవా చేసింది. ఇవి మాత్రమే కాదు… ఇన్ పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీకి రుణాలు, రైతుల ఆత్మహత్యలపై కూడా చర్చ జరిగింది.

టీడీపీ హయాంలో.. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వాలని.. నిర్ణయించినట్లు జగన్ సభాముఖంగా ప్రకటించారు. మరి వైఎస్ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న 14వేల మంది సంగతేమి చేశారని టీడీపీ ప్రశ్నించింది. అయితే.. ఈ చర్చలో.. ప్రభుత్వం కరువు తీవ్రంగా ఉందని అంగీకరించింది. 48శాతం వర్షపాతం లోటు ఉందని.. సీఎం చెప్పారు. అందుకే… తాగునీటి అవసరాలు తీర్చేందుకు నియోజకవర్గానికి కోటి రూపాయలు చొప్పున విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకూ ఇస్తామన్నారు. ఇదొక్కటే అసెంబ్లీ వేదికగా చర్చల ద్వారా వచ్చిన పరిష్కారం.

ఈ కరువు కాలంలో.. రైతులకు ఎలాంటి సాయం చేయబోతున్నారో ప్రభుత్వం ప్రకటించలేకపోయింది. అదే సమయంలో.. రైతులకు ఏం చేస్తారో చెప్పాలని విపక్షం పట్టుబట్టలేకపోయింది. అధికారపక్షానికి కౌంటర్ ఇవ్వడానికే సరిపోయింది. మొత్తంగా.. రైతులకు.. ఈ కరువు కాలంలో ఈ చర్యల ద్వారా అండగా ఉంటామని మాత్రం… ప్రభుత్వం భరోసా ఇవ్వలేకపోయింది. విపక్షం అలాంటి భరోసా ఇప్పించలేకపోయింది. ఒక్కో సందర్భంలో.. ఒకరు ఆరోపణలు చేస్తే.. మరొకరు తిప్పికొట్టుకోవడానికే సమయం కేటాయించారు. కానీ..నిజంగా రైతు సమస్యలకు పరిష్కారం చూపుదామనే ప్రయత్నం మాత్రం జరగలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close