కోట్లు పెట్టి విజయవాడకు విమానాలు పెంచుతున్న ప్రభుత్వం !

ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతి విషయంలో శీతకన్ను వేయడం.. కరోనా కారణంగా విజయవాడ ఎయిర్ పోర్టుకు రద్దీ తగ్గిపోయింది. వచ్చి, పోయే విమానాల రాకపోకలు అరవై శాతానికిపైగా తగ్గిపోయాయి. ప్రభుత్వం ఉడాన్ పథకంలో భాగంగా గతంలో విమానాలు నడిపిన ట్రూజెట్ వంటి సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆ కంపెనీలు కూడా తమ సర్వీసుల్ని నిలిపివేశాయి. ఇప్పుడు ప్రభుత్వ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఆఫర్ ఇచ్చి మరీ ఇతర కంపెనీలను విమానాలు నడపాలని పిలుస్తున్నారు.

ప్రధానంగా విజయవాడ నుంచి రాయలసీమలో ఎయిర్‌పోర్టులు ఉన్న కడప, కర్నూలుకు కనీసం ఒక్క సర్వీసును అయినా నడిపిచాలన్న పట్టదలతో ప్రభుత్వం ఉంది. కడపకు గతంలో విమానాలు ట్రూజెట్ నడిపేది. కానీ ప్రభుత్వం ప్రోత్సహించలేదు. దాంతో సర్వీసులు నిలిచిపోయాయి. కడప కు విమానాలు లేకుండా పోయాయి. జగన్‌తో పాటు సీఎం రమేష్ వంటి వాళ్లు తమ ప్రత్యేక విమానాలతో వెళ్లడానికే అది ఉపయోగపడుతోంది. ఇటీవల రూ. ఇరవై కోట్లు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ చేసి విమానాలు తిప్పేలా ఇండిగోతో ఒప్పందం చేసుకోవాలని కేబినెట్‌లో నిర్ణయించారు.

ఇటీవల కర్నూలు ఎయిర్ పోర్టుప్రారంభమమింది. ఓ సర్వీసు నడిపేలా చేయగలిగారు. ఇప్పుడు విజయవాడ నుంచి కూడా కర్నూలుకు ఓ సర్వీసును పెంచాలని.. రాయలసీమ వాసులకు విజయవాడతో కనెక్టివిటీ పెంచాలని ప్రయత్నిస్తున్నారు. ఇండిగోతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. రాజధాని విషయంలో ప్రభుత్వం కాస్త మెత్తబడటంతో పరిపాలన తప్పనిసరిగా అమరావతి నుంచే జరగాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ప్రభుత్వ వ్యూహంలో మార్పులు వచ్చాయని భావిస్తున్నారు. అందుకే బెజవాడకు ఎయిర్ కనెక్టివిటీని మళ్లీ పెంచుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

యూపీ, బీహార్‌లలో తేడా వస్తే బీజేపీ ఖల్లాస్ !

ఆరు విడతల పోలింగ్ ముగిసిన తరవాత భిన్నమైన విశ్లేషణలు దేశవ్యాప్తంగా వస్తున్నాయి. అయితే బీజేపీ పరిస్థితి గొప్పగా ఉందని ఎవరూ చెప్పలేకపోతున్నారు. రెండు ప్రధాన రాష్ట్రాల్లో బీజేపీ సాధించబోయే ఫలితాలను...
video

టైటిల్ దాచేసిన క‌ల్యాణ్ రామ్‌

https://youtu.be/N8t7rRIpsyo?si=WjbCDzlhjx8uuAt7 `బింబిసార‌` సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌వ్వ‌డంతో మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చాడు కల్యాణ్ రామ్. ఆ త‌ర‌వాత అమిగోస్‌, డెవిల్ నిరాశ ప‌రిచాయి. వీటి త‌ర‌వాత ఓ సినిమా మొద‌లెట్టిన‌ప్ప‌టికీ దానికి సంబంధించిన వివ‌రాలేం...

పిన్నెల్లి కేసులో వైసీపీ లాయర్లను నమ్మని పోలీసులు !

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాల కు ఆయనను తప్పనిసరిగా అరెస్టు చేయాల్సిందేనని పోలీసులు పట్టుదలగా ఉన్నారు. తమ సీఐపై హత్యాయత్నం చేసి ఆయనపై కుల ముద్ర వేసేందుకు వైసీపీ నేతలు చేస్తున్న...

సందీప్ కిష‌న్‌తో రీతూ వ‌ర్మ‌

సందీప్ కిష‌న్ క‌థానాయ‌కుడిగా త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. రాజేష్ దండా నిర్మాత‌. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా రీతూ వ‌ర్మ‌ని ఎంచుకొన్నారు. సందీప్‌తో రీతూ జోడీ క‌ట్ట‌డం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close