షర్మిలపై తెలంగాణను మించి ఏపీ పోలీసుల దాష్టీకం – విజయమ్మ స్పందనేమిటో ?

తెలంగాణలో షర్మిల రాజకీయ పోరాటం చేస్తున్న సమయంలో పోలీసులు ఆమెను ఓ సారి ఆపిన సందర్భంలో విజయమ్మ బయటకు వచ్చి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంద్‌కు పిలుపునివ్వమంటారా.. ఆందోళనలు చేయాలని పిలుపునివ్వమంటారా అని రెచ్చిపోయారు. తన కూతురిపై .. వైఎస్ బిడ్డపై చేతులెత్తేస్తారా అని శివాలెత్తారు. అయితే ఇప్పుడు ఏపీలో.. సీఎం జగన్ రెడ్డి పాలనలో ఉన్న పోలీసులే షర్మిలను అంత కంటే ఘోరంగా అరెస్టు చేశారు. తోపులాటలో షర్మిల చేతికి కూడా గాయం అయింది.

మెగా డీఎస్సీ కోసం షర్మిల చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు. విజయవాడలో కేవీపీ ఇంట్లో బస చేశారు. అయితే పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తారని సమాచారం రావడంతో ఆమె వెంటనే కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లారు. రాత్రి అక్కడే ఉన్నారు. ఉదయమే.. అక్కడ ఉన్న నేతల్ని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. తర్వాత షర్మిల ధర్నా చేసి.. సెక్రటేరియట్ కు బయలుదేరారు. దారిలో వందల మంది పోలీసుల్ని మోహరించిన ప్రభుత్వం మధ్యలో బలవంతంగా అరెస్టు చేసింది. బలవంతంగా ఎత్తేసి తీసుకెళ్లి పోలీసు వ్యాన్ లో పడేశారు. తర్వాత మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా షర్మిల తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు చూసి.. తన తల్లి విజయమ్మ కూడా బాధపడుతుందన్నారు. ఆడబిడ్డపై చేయి వేయడం జగన్ రెడ్డి పాపమని మండిపడ్డారు. పాలనే చేతకావడం లేదని .. ఏమీ చేయడం లేదని.. ఇదా వారసత్వం అని ప్రశ్నించారు. ఈ రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా.. ఇప్పుడు గతంలో షర్మిల, తానుకలిసి తిరిగి ఓట్లు వేయమని ప్రచారం చేసిన చోటునే.. అధికారంలోకి వచ్చిన కొడుకు.. కూతుర్ని పోలీసులతో అరెస్టు చేయించడం మాత్రం విజయమ్మకు ఇబ్బందికరమైన అంశమే. ఈ విషయంలో కూతుర్ని.. కొడుకును కూడా సమర్థించలేరు. వ్యతిరేకించలేరు. కొడుకు చేస్తున్నది తప్పని చెప్పలేని పరిస్థితిలో ఆమె ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

22మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ లోకి హరీష్..!?

బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హారీష్ రావు కాంగ్రెస్ లో చేరనున్నారా..? 20-22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరుగుతుండగా..ఆ ఎమ్మెల్యేల వెనక బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావు...

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close