జనసేన బాలరాజుకు ఆఫర్ ఇచ్చిన వైసీపీ..!

విశాఖ మన్యంలో కీలక నేతగా ఉన్న సివేరి దొన్నుదొర వైసీపీకి గుడ్ బై చెప్పి.. టీడీపీలో చేరడంతో… నష్ట నివారణ కోసం.. వైసీపీ .., జనసేన నేతపై గురి పెట్టినట్లుగా కనిపిస్తోంది. పాడేరుకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి బాలరాజును.. వైసీపీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీకి చెందిన కొంత మంది కీలక నేతలు ఇప్పటికే బాలరాజుతో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. పసుపులేటి బాలరాజు.. తనకు ఇచ్చే ప్రాధాన్యత గురించి… చర్చలు జరుపుతున్నారని.. త్వరలోనే ఇవి కొలిక్కి వస్తాయని అంటున్నారు. బాలరాజు… వైఎస్ హయాంలో మంత్రిగా పని చేశారు. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడే. అయితే.. ఆయన జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు ఆయనతో నడవలేదు. కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపునే పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో పెద్ద పెద్ద నేతలు… కూడా.. డిపాజిట్లు తెచ్చుకోలేకపోయారు. కానీ.. పాడేరులో బాలరాజుకు ఉన్న పట్టు కారణంగా 21వేల ఓట్లు తెచ్చుకున్నారు. మళ్లీ 2019లో వైసీపీలో చేరేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. ఆయనను తీసుకునేందుకు వైసీపీ నేతలు ఆసక్తి చూపించలేదు. దీంతో ఆయన జనసేన పార్టీలో చేరారు. అయితే.. జనసేన పార్టీ తరపున పాడేరు నుంచి పోటీ చేసినప్పటికీ.. గతంలో సాధించినన్ని ఓట్లు కూడా సాధించలేదు. దాంతో.. బాలరాజు.. తన రాజకీయ భవిష్యత్ పై డోలాయమానంలో పడినట్లుగా కనిపిస్తోంది.

జనసేన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నప్పటికీ.. వైసీపీ నేతలు ఆహ్వానించడంతో.. ఆ పార్టీలో చేరికపై.. అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… పవన్ కల్యాణ్ ను రాజకీయంగా బలహీనం చేసేందుకు వ్యూహాలు పన్నుతున్న ప్రచారం జరుగుతునన నేపధ్యంలో… ఇలా.. జనసేన నేతలకు.. వైసీపీ నుంచి ఆఫర్లు రావడం ఆసక్తి కలిగిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close