ఈటల రాజేందర్‌కు బీజేపీ నేతల సహాయ నిరాకరణ

ఈటల రాజేందర్‌ హైకమాండ్ ను సంతృప్తి పరిచి.. మల్కాజిగిరి టిక్కెట్ తెచ్చుకున్నారు కానీ.. మల్కాజిగిరి పరిధిలో బీజేపీ నేతల్ని మాత్రం అనుకూలంగా మల్చుకోలేకపోతున్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి అర్బన్‌ బీజేపీ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీశ్‌రెడ్డి బీజేపీకి ఆదివారం రాజీనామా చేశాడు. కుత్బుల్లాపూర్ మాజీ ఎణ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఈటలపై వ్యతిరేకతతో ఉన్నారు. ఆయన కూడా పక్క చూపులు చూసుకుంటున్నారు. కూన గనుక పార్టీని వీడితే బీజేపీ ఓటుబ్యాంకుకు భారీ గండి పడే అవకాశాలున్నాయి.

తెలంగాణ ఉద్యమ సమయంలో డక్కీలుమొక్కీలు తిని నేతగా ఎదిగిన ఈటల రాజేందర్‌కు బీజేపీలో చేరిన తర్వాత ఏదీ కలిసిరావడం లేదని అర్ధమవుతున్నది. బయటి పార్టీల వాళ్ల కంటే సొంత పార్టీలోని నేతలకే ఆయన ఎక్కువగా టార్గెట్‌ అవుతున్నారు. సీటు ఆశించి భంగపడిన నేతలంతా ఒక్కటై ఈటలకు వ్యతిరేకంగా గ్రూపుకట్టారు. ఆయన ఓటమి కోసం కొందరు ముఖ్యనేతలు తెరవెనుక పావులు కదుపుతుండగా…తెర ముందు కూనం శ్రీశైలంగౌడ్‌, తూళ్ల వీరేందర్‌గౌడ్‌ ముఖ్యంగా కనిపిస్తున్నారు. మురళీధర్‌రావు వెనుకుండి చక్రం తిప్పుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈటల అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా రూరల్‌ అధ్యక్షులు విక్రమ్‌రెడ్డి, అర్బన్‌ జిల్లా అధ్యక్షలు పన్నాల హరీశ్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, మాజీ ఎంపీ చాడ సురేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఏనుగు సుదర్శన్‌రెడ్డి, తదితరులున్నారు. వీరంతా ఈటలకు సహకరించే పరిస్థితి లేదు. ఈటల మాత్రం పార్టీ హార్డ్‌కోర్‌ శ్రేణులను నమ్ముకుని ముందుకు వెళ్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని ఏడు లక్షలకుపైగా ఉన్న ఉత్తర భారతదేశం ఓటర్లు తనకు అండగా నిలుస్తారనే ధీమాతో ఉన్నారు. ఇది ఎంత వరకు సాధ్యం అవుతుందనే దాన్ని వేచిచూడాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close