ఇట్స్ అఫీషియల్..! జనసేనలోకి బీజేపీ ఎమ్మెల్యే..!

రాజమండ్రి అర్బన్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ… జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 21న పవన్‌ సమక్షంలో జనసేనలో చేరబోతున్నట్లు ఆకుల సత్యనారాయణ ప్రకటించారు. ప్రస్తుతం ఆకుల సత్యనారాయణ భార్య జనసేన నేతగా ఉన్నారు. ఆమెకు రాజానగరం అసెంబ్లీ టిక్కెట్, ఆకుల సత్యనారాయణకు రాజమండ్రి పార్లమెంట్ టిక్కెట్ ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. దీంతో.. ఆకుల సత్యనారాయణ పవన్ తో నడవాలని నిర్ణయించుకున్నారు. బీజేపీకి ప్రజాదరణ లేకపోవడం వల్లే పార్టీని వీడుతున్నానని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ వ్యవహరించిన తీరు బాధకలిగించిందని ఆకుల సత్యనారాయణ చెబుతున్నారు. విశాఖ రైల్వేజోన్, కడప స్లీల్‌ప్లాంట్‌ ప్లాంట్‌…దుగరాజపట్నం పోర్టు విషయంలో కేంద్రం తీరు బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు. పవన్ పిలుపు ఇస్తే ప్రజలు తరలివస్తున్నారని అందుకే.. జనసేనలో చేరుతున్నానని చెప్పుకొచ్చారు.

మూడు రోజుల కిందట.. ఆకుల సత్యనారాయణ రాజీనామా చేయడానికి ఢిల్లీ వెళ్లారు. అక్కడ అమిత్ షాను కలిసి రాజీనామా లేఖ ఇద్దామని ప్రయత్నం చేసినా కుదరలేదు. దాంతో తిరిగి వచ్చేశారు. అప్పటికే మీడియాలో రావడంతో… రాజీనామా అంశాన్ని తోసి పుచ్చారు కానీ.. ఖండించలేదు. ఇప్పుడు ఖరారు చేశారు. భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది. టీడీపీ పదమూడు అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే.. అందులో నాలుగు చోట్ల మాత్రం విజయం సాధించారు. రాజమండ్రి అర్బన్, తాడేపల్లిగూడెం,కైకలూరు, విశాఖ ఉత్తర స్థానాల నుంచి ఎమ్మెల్యేలుగా బీజేపీ నేతలు గెలిచారు. వీరిలో ఇప్పుడు.. ముగ్గురు పక్క చూపులు చూస్తున్నారు. తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే మాణిక్యాల రావు మాత్రమే బీజేపీలో గట్టిగా ఉంటారని చెబుతున్నారు. ఆకల సత్యనారాయణ గుడ్ బై చెప్పేశారు. ఇక కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన పోటీ చేయబోవడం లేదని ప్రకటించారు. అలాగే విష్ణుకుమార్ రాజు కూడా టీడీపీ వైపు చూస్తున్నారని చెబుతున్నారు.

భారతీయ జనతా పార్టీకి వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకడం కష్టంగా మారింది. ఆ పార్టీకి చెందిన అగ్రనేతలుగా చెలామణి అవుతున్న వారెవరూ.. పోటీకి సిద్ధపడటం లేదు. అదే సమయంలో.. పార్టీలో గ్రూపు తగాదాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒక నేతంటే.. మరో నేతకు సరి పడని పరిస్థితి ఉంది. నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, విశాఖ ఎంపీ హరిబాబు కూడా.. ఇటీవలి కాలంలో.. పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. తాము ఈ సారి పోటీ చేయబోవడం లేదని.. వారు తమ సన్నిహితులకు చెబుతున్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఏపీ బీజేపీకి.. మరిన్ని ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close