కవిత కేసు 3 వారాలకు వాయిదా !

సుప్రీం కోర్టులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసుకున్న కేసు విచారణ మూడు వారాలకు వాయిదాపడింది. ఈడీ కార్యాలయంలో మహిళలను పిలిచి విచారణ చేయొద్దని కవిత పిటిషన్ దాఖలు చేసింది. తన నివాసంలోనే విచారణ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌ను నళిని చిదంబరం కేసుతో కవిత కేసు ట్యాగ్ చేసిన సుప్రీంకోర్టు… తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. అయితే ఇలా ట్యాగ్ చేయడాన్ని అడిషనల్ సొలిసిటర్ జనరల్ వ్యతిరేకించారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఈ కేసులో చాలా కోర్ అంశాలున్నాయన్నారు.

అన్నింటినీ లోతుగా విచారణ చేయాల్సి ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కవిత తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. ఈ కేసులో కవిత నిందితురాలు కాదన్నారు. సమన్ల విషయంలో ఈ డీ ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కాలేదన్నారు. చార్జి షీట్ ఇప్పటికే దాఖలు చేశారని అందుకే
నళిని చిదంబరం కేసులతో దీన్ని ట్యాగ్ చేయాలని సూచించారు. సిబల్ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది.

అయితే లిక్కర్ స్కాం కేసు విచారణ ఈ వాయిదాపై ప్రభావం పడే అవకాశం లేదని భావిస్తున్నారు. ఈ పిటిషన్ విచారణ తర్వాత కూడా కవిత రెండు రోజులు ఈడీ ఆఫీసుకు వెళ్లారు. రాత్రి పది గంటల వరకూ విచారణ ఎదుర్కొన్నారు. కవితను మళ్లీ పిలుస్తామని ఈడీ అధికారులు చెప్పారు కానీ మళ్లీ విచారణ ఎప్పుడన్నదానిపై క్లారిటీ లేదు. ఓ రకంగా సుప్రీంకోర్టు ఏ నిర్ణయమూ వెలువరించకపోవడం కవితకు ఊరటనిస్తుందని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

గుంతకల్లు రివ్యూ : “బెంజ్‌ మంత్రి”కి సుడి ఎక్కువే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ...

బ్యాండేజ్ పార్టీ : వైసీపీ డ్రామాలపై జనం జోకులు

వెల్లంపల్లి కంటికి బ్యాండేజ్ వేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయంలో పక్కనున్న జనం నవ్వుతున్నారని కూడా ఆయన సిగ్గుపడటం లేదు. కంటికి పెద్ద ఆపరేషన్ జరిగినా రెండు రోజుల్లో బ్యాండేజ్ తీసేస్తారు నల్లకళ్లజోడు పెట్టుకోమంటారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close