అయితే ఈ సారి రైతు బంధు ఇవ్వట్లేదా ?

ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేలోపునే రైతు బంధు డబ్బులు రైతుల అకౌంట్లలో వేయాలని పోలింగ్ తేదీలు దగ్గరకు వచ్చినప్పుడు కాదని రేవంత్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పట్టుకుని బీఆర్ఎస్ నేతలు ఒక్క సారిగా విరుచుకుపడటం ప్రారంభించారు. రైతు బంధు ను ఆపేయమని.. కాంగ్రెస్ నేతుల ఫిర్యాదులు చేశారని.. రైతులందరూ కలిసి కాంగ్రెస్ ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వరుసగా ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్లు పెట్టి ఈ ఆరోపణలు చేశారు.

ఎన్నికల కోడ్‌పై బీార్ఎస్ ఎంత హడావుడి చేస్తే..అంత అనుమానాలు ప్రజల్లో కలిగే అవకాశాలు ఉన్నాయి. గతంలోనూ ఎన్నో పథకాలను ప్రారంభించి ఇలా కోడ్ రాగానే అలా ఆపేసి..ఇతర పార్టీలపై విమర్శలు చేసేవారు. చివరికి గ్రేటర్ ఎన్నికల్లో వరద బాధితులకు కొంత సాయం చేసి.. గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి మొత్తం ఆపేసి.. బీజేపీ వల్లనే ఆపేశామని విమర్శలు గుప్పించారు. దళిత బంధు విషయంలోనూ అంతే. ఎన్నికలు అయిన తర్వాత అయినా వాటిని ఇచ్చారా అంటే ఇవ్వలేదు. ఇప్పుడు రైతు బంధు, దళిత బంధు విషయంలో బీఆర్ఎస్ నేతల ఓవర్ రియాక్షన్ చూస్తూంటే… పథకానికి డబ్బులు ఇచ్చే ఉద్దేశంలో లేరన్న అనుమానాలను కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఖజానాలో డబ్బుల్లేవని.. రైతు బంధు ఇవ్వాలంటే.. ఆరేడు వేల కోట్లు కావాలని.. ఎన్నిక కోడ్ పేరుతో పథకాన్ని ఆపేసి కాంగ్రెస్ మీదకు తోసేయాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు.

నగదు బదిలీ పథకాలన్నింటినీ… నవంబర్ రెండో తేదీ లోపునే అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఏదైనా సరే.. రైతు బంధు .. ఆపితే అది బీఆర్ఎస్‌కే మైనస్ అయ్యేలా ఉంది. వాళ్లు ఆపారని.. వీళ్లు ఆపారని సాకులు చెబితే రైతులు నమ్మే అవకాశం ఉండదు. ఎందుకంటే.. అధికారంలో ఉంది బీఆర్ఎస్సే మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close