మునుగోడులో కారుకు పోటీగా బుల్‌డోజర్, రోడ్డురోలర్ !

కారును పోలి ఉండే గుర్తుల వల్ల పెద్ద ఎత్తున ఓట్లను కోల్పోతున్నామంటూ టీఆర్ఎస్ లెక్కలతో సహా ఈసీకి చెప్పినా ప్రయోజనం లేకపోయింది. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసినా ఫలితం రాలేదు. దీంతో మునుగోడులోనూ మరోసారి టీఆర్‌ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవనున్నాయి. కారు గుర్తును పోలి ఉన్న డోజర్, రోడ్డు రోలర్‌లను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించేశారు. వాటిని కేటాయించకుండా ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ఆ గుర్తులు బ్యాలెట్‌లో ఉండనున్నాయి. ఈ రెండింటితో పాటు మరో ఆరు గుర్తులను వద్దని టీఆర్ఎస్ చెబుతోంది.

వాటి వల్ల గతంలో తమకు జరిగిన నష్టమేంటో కూడా చెప్పారు. 2018లో రోడ్డు రోలర్‌ గుర్తుకు జహీరాబాద్‌లో ఏకంగా 4330 ఓట్లు వచ్చాయి. డోర్నకల్‌లో రోడ్డురోలర్‌కు 4,117 ఓట్లు , మునుగోడులో రోడ్డు రోలర్‌కు 3,569 ఓట్లు వచ్చాయి. దీనికి కారణం రోడ్‌ రోలర్‌ గుర్తు కారును పోలి ఉండటమే. మరికొన్ని చోట్ల ఇదే కారణంగా కెమెరాకు 3 వేల నుంచి 9 వేల ఓట్లు.. టీవీకి 2 వేల నుంచి 3 వేల ఓట్లు వచ్చాయి. కారును పోలిన ఎన్నికల గుర్తులను కేటాయించవద్దని టీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేయగా, నేడు విచారణ చేపట్టిన ధర్మాసనం ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఇంత దూరం వచ్చాక జోక్యం చేసుకోలమని స్పష్టం చేసింది.

ఈవీఎంలో స్టాంప్‌ పరిమాణంలో ఉండే కారును పోలిన గుర్తుల కారణంగా ఓటర్లు తికమకపడతారని, రోడ్‌ రోలర్‌ గుర్తును ఎవరికీ కేటాయించబోమని ఈసీ 2011లో ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా ఆ గుర్తును కేటాయించారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏం జరిగినా.. మొత్తంగా బరిలో టీఆర్ఎస్‌కు పోటీగా బుల్ డోజర్, రోడ్డు రోలర్ గుర్తులు ఈవీఎంలో ఉండనున్నాయి. అయితే ఎక్కువ మంది అభ్యర్థులు ఉండటంతో వారి గుర్తులు ఎక్కడో అడుగున ఉంటాయి కాబట్టి సమస్య ఉండదని అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close