మళ్లీ వచ్చిన సీబీఐ.. ఇప్పుడు “ఆ” ఆరోపణలు చేసిన వారి వంతు !

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హఠాత్తుగా బ్రేక్ పడింది. ఏమయ్యారు సీబీఐ వాళ్లు అని అనుకునేలోపు మళ్లీ తిరిగి వచ్చారు. బుధవారం పులివెందులలో భరత్ యాదవ్ అనే స్వయం ప్రకటిత జర్నలిస్టును పిలిచి ప్రశ్నించారు. ఈ భరత్ యాదవ్ గతంలో సీబీఐకి కీలక విషయాలు చెబుతూ లేఖ రాశానని ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారు. దీంతో ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నించాలని నిర్ణయించారు. అవినాష్ ప్రధాన ‌అనుచరుడు శంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత వరుసగా వైఎస్ సునీత్, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలపై అనుమానం వ్యక్తం చేస్తూ మీడియా ముందుకు వచ్చిన వారిలో మొదటి వ్యక్తి.

ఆ తర్వాత మరికొంత మంది వచ్చారు. ఇప్పుడు వారందర్నీ ప్రశ్నించాలని సీబీఐ నిర్ణయం తీసుకుంది. దేవిరెడ్డి శంకర్ రెడ్డిని ఆరు రోజుల కస్టడీకి తీసుకుని నాలుగు రోజులకే మళ్లీ కోర్టుకు సరెండర్ చేసిన సీబీఐ ఆ తర్వాత ఆయనను కోర్టు అనుమతి లేకుండానే ఆస్పత్రికి తరలించినా పట్టించుకోలేదు. ఇప్పుడు వైఎస్ సునీత, రాజశేఖర్ రెడ్డిలపై అనుమానం వ్యక్తం చేసిన వారిని ప్రశ్నించి.. ఆధారాలు సేకరించే పనిలోకి దిగారు. సీబీఐ పైనా ఆరోపణలు చేశారు. వాటి గురించీ సీబీఐ నిగ్గు తేల్చాల్సి ఉంది.

మరో వైపు దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరగాల్సి ఉంది. మొత్తంగా చూస్తే వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకు జరిగిన విచారణ ఒకటైతే.. ఇక ముందు జరగనున్న విచారణ మరొకటని అనుకోవచ్చు. కీలక మలుపులు తిరిగే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: ఎన్నిక‌ల‌కు ముందూ త‌గ్గేదే లే!

మే 13న ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. నెల రోజుల ముందు నుంచే ఈ ఎల‌క్ష‌న్ ఫీవ‌ర్ టాలీవుడ్ ని తాకింది. ఆ ఎఫెక్ట్ వ‌సూళ్ల‌పై తీవ్రంగా క‌నిపిస్తోంది. వారానికి రెండు మూడు సినిమాలొస్తున్నా...

మారుతి సినిమాకి ‘భ‌లే’ బేరం!

ఈమ‌ధ్య ఓటీటీ రైట్స్ విష‌యంలో నిర్మాత‌లు తెగ బెంగ ప‌డిపోతున్నారు. ఓటీటీలు సినిమాల్ని కొన‌డం లేద‌ని, మ‌రీ గీచి గీచి బేరాలు ఆడుతున్నార‌ని వాపోతున్నారు. అయితే కొన్ని సినిమాలు మాత్రం గ‌ప్ చుప్‌గా...

జైలు నుండే సీఎం రేవంత్ కు క్రిశాంక్ సవాల్

ఉస్మానియా వర్సిటీ పేరుతో సర్క్యూలర్‌ను మార్ఫింగ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్ జైలు నుండే సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. తాను...

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పై వైసీపీ కంగారుతో ప్రజల్లో మరింత అనుమానాలు !

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా ప్రచారం అవుతోంది. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దీన్ని ఆపాలని జగన్ రెడ్డి పోలీసుల్ని పురమాయిస్తున్నాయి. సీఐడీ కేసునూ పెట్టించగలిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close