ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీబీఐ విచారణ..!?

నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అక్రమాలపై సీబీఐ విచారణకు హైకోర్టు ఉత్తర్వులు ఎలాంటి ఆటంకం కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆయన తన భార్య, కుమార్తె పేరుతో కంపెనీలు పెట్టి.. బ్యాంకుల రుణాలు తీసుకుని ఎగ్గొట్టారని కేసులు నమోదయ్యాయి. బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. రుణాలు చెల్లించని కంపెనీల ఖాతాలను మోసపూరితంగా ప్రకటించాలని ఆర్బీఐ గతంలో సర్క్యూలర్ జారీ చేసింది. ఆ మేరకు… రఘురామకృష్ణరాజు కంపెనీల ఖాతాలను కూడా ఆయా బ్యాంకులు మోసపూరిత ఖాతాలుగా ప్రకటించాయి. దీనిపై ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. కనీసం వివరణ కూడా తీసుకోకుండా బ్యాంకులు ఆ విధంగా చేశాయని… నిలుపుదల చేయాలని కోరారు.

అప్పుడు ఆయనకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. అయితే.. ఆ తీర్పు తదుపరి చర్యలు తీసుకోవడానికి అడ్డం కాదని తాజాగా హైకోర్టు సీబీఐ విచారణ చేయడానికి ఎలాంటి ఆటంకాలు లేవని తాజాగా స్పష్టత ఇచ్చింది. బ్యాంకులకు రఘురామకృష్ణరాజు కొన్ని వేల కోట్ల బాకీ ఉన్నారు. ఆయనపై సీబీఐ కేసులు కూడా ఉన్నాయి. కారణం ఏమిటో కానీ ఎంపీగా ఎన్నిక కాక ముందు ఆయన ఇళ్లల్లో సోదాలు చేశారు కానీ.. తర్వాత పట్టించుకోవడం మానేశారు. హైకోర్టు ఉత్తర్వుల కారణంగానే సీబీఐ ఆగిపోయిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు… హైకోర్టు సీబీఐ విచారణకు .. తన ఉత్తర్వులు అడ్డంకి కాదని స్పష్టం చేసింది.

ఇటీవల సుజనా చౌదరికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు కూడా… ఇబ్బంది ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. అయితే ఆయన బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. హైకోర్టు నుంచి ఇలాంటి రూలింగ్ వచ్చిన రోజునే ఆయన ప్రధానితో భేటీ అయ్యారు. ఈ కారణంగా ఆయన మరీ టెన్షన్ పడటం లేదంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close