జగన్ ఎంతో అడిగితే… కేంద్రం కొంతే ఇచ్చింది..!

పోలవరం ప్రాజెక్ట్‌కు.. రూ. ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టామని.. ఆ నిధులను రీ ఎంబర్స్ చేయాలని.. దాదాపుగా ఏడాదిగా అడుగుతున్న ఏపీ సర్కార్‌కు కేంద్రం… కేవలం రూ. 1850 కోట్లు మాత్రమే విడుదల చేసేందుకు అంగీకరించింది. జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరానికి చట్టం ప్రకారం.. వంద శాతం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయాన్ని కేంద్రం భరించాలి. అయితే.. ముందుగా ఏపీ సర్కార్ ఖర్చు పెట్టాలి. వాటిని కేంద్రం రీఎంబర్స్ చేస్తుంది. ఈ ప్రకారం.. గత ప్రభుత్వం శరవేగంగా చేపట్టిన పనుల వల్ల.. రూ. ఐదు వేలకోట్ల వరకూ నిధులు రావాల్సి ఉంది. ఎన్నికలకు ముందు నుంచే ప్రభుత్వం ఆ నిధుల కోసం.. కేంద్రాన్ని అడుగుతూ ఉంది.

జగన్మోహన్ రెడ్డి.. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా… ఇచ్చే వినతి పత్రాల్లో పోలవరం నిధుల ప్రస్తావన కూడా ఉంటుంది. ఇటీవల ప్రధాని మోడీ… హోంమంత్రి అమిత్ షాలను కలిసినప్పుడు.. పోలవరం కోసం.. ఏపీ సర్కార్ ఖర్చు పెట్టిన రూ. ఐదు వేల కోట్లతో పాటు.. ఈ ఏడాది సహాయ, పునరావాసానికి రూ. పదహారుల వేల కోట్లు ఇవ్వాలని కోరారు. అయితే… పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ.. నుంచి.. వచ్చిన వివరాల ప్రకారం… రూ.3 వేల కోట్లకు మాత్రమే కేంద్ర జలశక్తి శాఖ ఆర్థిక శాఖకు ఫైల్ పంపింది. చివరికి ఆర్థిక శాఖ.. అందులోనూ కేవలం రూ.1850కోట్లకు మాత్రమే అంగీకారం తెలిపింది.

ప్రభుత్వం నుంచి ఇంకా కొన్ని వివరాలు తెప్పించుకున్న తర్వాత మిగిలిన నిధులు విడుదల చేస్తామని చెబుతోంది. ఇక సహాయ పునరావాస కార్యక్రమాలకు మాత్రం.. నిధుల ఊసు లేదు. అసలు.. ఆ పనులతో తమకు సంబంధం లేదని కేంద్రం వాదిస్తోంది. పైగా ఇప్పుడు ఏపీ సర్కార్ తీవ్రమైన నిధుల కటకటలో ఉంది. పాత కాంట్రాక్టర్ ను తొలగించి.. కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించింది. సెటిల్ చేయాల్సిన బిల్లులు కూడా పెద్ద మొత్తంలో ఉన్నాయి. అయినా కేంద్రం కేవలం రూ. 1850 కోట్లు మాత్రమే విడుదల చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close