మోదీ 3.0 వచ్చి ఏడాది అయింది. ఈ సందర్భంగా జాతీయ మీడియాలన్నీ చంద్రబాబు ఇంటర్యూలు తీసుకుంటున్నాయి. ఎక్స్ క్లూజివ్ అంటూ ప్రైజ్ టైమ్ లో ప్రసారం చేస్తున్నాయి. చంద్రబాబు మాట్లాడే మాటల్ని హెడ్ లైన్స్ గా ప్రచారం చేస్తున్నాయి. ఇది జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు ప్రాధాన్యతను గుర్తు చేస్తున్నాయి. అయితే చంద్రబాబు రాజకీయం విషయంలో అందరి అంచనాలను తల కిందులు చేస్తున్నారు. మోదీతో.. ఎన్డీఏతో ఏడాది తర్వాత కాస్త గ్యాప్ ఉందని చెప్పాలనుకున్న మీడియాకు… అలాంటి చాన్స్ ఇవ్వలేదు. పూర్తి స్థాయిలో ఎన్డీఏకు మద్దతుగా .. ఎన్డీఏ విధానాలకు పూర్తి మద్దతు ఇస్తూ..తనదైన రీతిలో ఇంటర్యూలు ఉన్నారు.
ప్రధాని మోదీ దేశానికి సరైన సమయంలో.. సరైన నాయకుడని ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశానికి అత్యంత బలవంతుడైన ప్రధాని కావాలని.. ఖచ్చితంగా ప్రధాని మోదీ ఆ పాత్రను సమర్థంగా నిర్వహిస్తున్నారని అంటున్నారు. ఇక దక్షిణాది విషయంలో ఉన్న అసంతృప్తుల్ని.. సెంటిమెంట్లను టీడీపీకి అన్వయించేందుకు జాతీయ మీడియా చేసిన ప్రయత్నాలనూ నిర్వీర్యం చేశారు. హిందీ భాష విషయంలో చంద్రబాబు .. ఎలాంటి రక్షణాత్మక ప్రకటనలు చేయలేదు. అలా చేసి ఉంటే జాతీయ మీడియా రెచ్చిపోయేది. కానీ చంద్రబాబు.. ప్రాంతీయ భాషల విషయంలో మరో చర్చే ఉండదని.. కానీ హిందీ నేర్చుకుంటే తప్పేమీ లేదని స్పష్టం చేశారు. భాష విభజనకు కారణం కాదని… అది బంధాలను నిర్మిస్తుందని చంద్రబాబు చెప్పారు. ఇది అందర్నీ ఆకట్టుకుంది.
ప్రధాని మోదీ పరిపాలన విషయంలో చంద్రబాబు వందకు వంద శాతం సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్డీఏతో ఏ విషయంలోనూ చిన్న సమస్య కూడా రాలేదని చెబుతున్నారు. జాతీయ మీడియా అంతా ఆయనను కింగే మేకర్ అని సంబోధించడానికి ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ స్థిరత్వంపై ఎలాంటి సందేహాలు రాకుండా.. చంద్రబాబు చాలా పక్కాగా రాజకీయం చేస్తున్నారని ప్రశంసిస్తున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం .. ఇలాంటి మాటల్ని పెద్దగా పట్టించుకోవడంలేదు. కింగ్ మేకర్ అనే పదాన్ని కూడా ఆయన యాక్సెప్ట్ చేయడం లేదు.
మోదీ 3.0 గత రెండువిడతల కన్నా సక్సెస్ ఫుల్గా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. సరిహద్దుల్లో అత్యంత కఠినమైన పరిస్థితుల్ని సైతం సమర్థంగా ఎదుర్కొన్నా ఉన్న ప్రశంసలు లభిస్తున్నాయి. చంద్రబాబు ఇస్తున్న సపోర్టు కీలకమని జాతీయ మీడియా అభిప్రాయపడుతోంది.