బీజేపీతో “పరిచయాలు పెంచుకుంటున్న” చంద్రబాబు..!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. బీజేపీ అగ్రనాయకత్వంతో మళ్లీ టచ్‌లోకి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా.. నరేంద్ర మోడీ, అమిత్ షాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వారు తీసుకునే నిర్ణయాలకు అడగకపోయినా మద్దతు ప్రకటిస్తున్నారు. అమరావతి ని భారతదేశ మ్యాప్‌లో గుర్తిస్తూ.. కేంద్రం ప్రకటన చేయడంతో.. అందరూ .. ఈ అంశాన్ని లేవనెత్తిన గల్లా జయదేవ్ ను అభినందించారు. చంద్రబాబు గల్లా జయదేవ్ ను విడిగా అభినందించారు.. కానీ.. ఇలా అడగగానే.. మ్యాప్‌లో అమరావతిని గుర్తించినందుకు.. నరేంద్రమోడీకి.. అమిత్ షాకు.. చంద్రబాబు కృతజ్ఞతలు చెబుతూ.. పోస్టులు పెట్టారు.

టీడీపీ ఘోర పరాజయం పాలయ్యాక.. చంద్రబాబును, అమిత్ షాను చంద్రబాబు పొగడటం.. ఇదే మొదటి సారి కాదు. ఆర్టికల్ 370 సహా.. పలు కీలక నిర్ణయాలకు.. చంద్రబాబు మద్దతు ప్రకటించారు. సోషల్ మీడియాలో అభినందనలు తెలుపుతూ పోస్టులు పెట్టారు. కొన్ని సందర్భాల్లో లేఖలు కూడా రాశారు. నిజానికి ఇలా స్పందించాల్సిన అవసరం లేదు . కానీ బీజేపీతో మళ్లీ దగ్గరి సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి.. చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం ఇదని చెప్పుకోవచ్చు. టీడీపీకి మిగిలిన ముగ్గురు లోక్‌సభ, ఇద్దరు రాజ్యసభ సభ్యులు కేంద్రాన్ని నొప్పింపకుండా… తాను బాధపడకుండా.. వ్యవహారాలను చక్క బెడుతున్నారు. ప్రభుత్వానికి దాదాపుగా ప్రతీ అంశంలోనూ మద్దతు పలుకుతున్నారు.

2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ.. 2019లో కటిఫ్ చెప్పేసింది. కేంద్రంలో హంగ్ వస్తే చక్రం తిప్పవచ్చని చంద్రబాబు ఆశపడ్డారు. కానీ.. మొత్తానికే సీటు జారిపోయింది. ఇప్పుడు మళ్లీ.. పార్టీని కాపాడుకోవడానికి.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు కావాల్సి వస్తోంది. ఏపీ ప్రయోజనాల కోసం.. పోరాడాలన్న… కట్టుబాట్లు ఇప్పుడు.. చంద్రబాబుకు లేవు. 22 మంది ఎంపీలున్న వైసీపీ.. అదీ కూడా అధికార పార్టీ అయినప్పటికీ.. ఏమీ మాట్లాడకపోతూండటంతో.. చంద్రబాబును కూడా ప్రశ్నించేవారు లేరు. ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని… మోడీ, షాలతో మళ్లీ పరిచయాలు పెంచుకునేందుకు తాపత్రయ పడుతున్నారు చంద్రబాబు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close