పోలవరం కాంట్రాక్టర్లను మార్చడమే ప్రభుత్వానికి ముఖ్యమా..?

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల నుంచి నవయుగను తప్పిస్తూ.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నవయుగకు నోటీసులు జారీ చేసింది. ప్రాజెక్టు పనుల రివర్స్ టెండరింగ్ అంశంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ అడుగులు ముందుకేసింది. నిపుణుల కమిటీ అక్రమాలు జరిగాయని.. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేశారని.. నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా… టెర్మినేషన్ నోటీసులు ఇచ్చారు. నిజంగా.. ఆ నివేదికనే ప్రభుత్వం నమ్మితే.. కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి కదా..! కానీ పరస్పర అంగీకారం కోసం ప్రయత్నాలెందుకు..?

అక్రమాలపై చర్యలు తీసుకోరా..? కాంట్రాక్టు వదిలేస్తే చాలా..?

పోలవరం ప్రాజెక్టులో.. అంతులేని అక్రమాలు జరిగాయని… వైసీపీ సర్కార్ వాదిస్తూ వచ్చింది. అన్నింటినీ నిగ్గు తేలుస్తామని ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి నుంచి విజసాయిరెడ్డి వరకూ అందరిదీ ఒకటే మాట. అందుకే పీటర్ కమిటీ వేశారు. ఈపీసీ విధానానికి వ్యతిరేకంగా పోలవరం పనులను ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ ట్రాయ్ నుంచి విడదీసి నవయుగ ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించారని పేర్కొంది. అంచనాలు పెంచడం, 60సి కింద నోటీసులు జారీ చేయడం, వేరే సంస్థలకు పనులు అప్పగించడం నిబంధనలకు విరుద్ధమని నిపుణుల కమిటీ తేల్చింది. ఇన్ని తేల్చినప్పుడు… ఈ కారణాలతోనే.. టెర్మినేషన్ నోటీసులు ఇచ్చినప్పుడు.. కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో.. ఎందుకు వైసీపీ సర్కార్ వెనుకడుగు వేస్తోంది.

పనులు వదిలేస్తే.. తాము వదిలేస్తామనే బేరం నవయుగకు పెట్టారా..?

న్యాయపరమైన వివాదాలు రాకుండా… ఇప్పటి వరకు చేసిన పనలున్నింటికీ చెల్లింపులు చేస్తామని.. పరస్పర అంగీకారంతోనే.. కాంట్రాక్ట్ సంస్థలు పనులు ముగించి వెళ్లాలనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. పోలవరం పనులు ఎంత జరిగాయో, ఇంకా పెండింగ్ పనులు ఎన్ని, లెక్కవేసే పనిలో పోలవరం ఇంజనీర్లు ఉన్నారు. అన్నీ లెక్కలేసి..నవయుగకు లెక్కలు సెటిల్ చేసే అవకాశం ఉంది. నిజానికి అక్రమాలు జరిగాయని వాదించినప్పుడు.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కానీ ప్రాజెక్టు పనులు ఆపేసి .. కాంట్రాక్టును వదిలేసుకుంటే.. తాము కూడా వదలేస్తామన్నట్లుగా ఆఫర్ ఇవ్వడమే చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది.

రివర్స్ టెండరింగ్‌కు కేంద్రం ఆమోదించకపోతే..?

2010-11 లెక్కల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 16వేల 010 కోట్ల రూపాయలు. ఆ సమయంలో 14 శాతం తక్కువకు టెండర్ ను ట్రాన్స్ ట్రాయ్ దక్కించుకుంది. కానీ పనులు చేయలేకపోయింది. తక్కువ ధరలకు చేయడానికి నవయుగ ముందుకు వచ్చింది. కానీ ఇప్పుడా సంస్థను బయటకు పంపేశారు. నవయుగను తొలగించడం పై పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలవనరులశాఖ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. జాతీయ ప్రాజెక్టు కావడంతో ఎటువంటి మార్పులు చేయలన్నా, కొత్తగా టెండర్లు పిలవాలన్నా కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close