చంద్రబాబు భద్రతతో సంబంధం లేదన్న ఏపీ సర్కార్..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి.. మాజీ సీఎం చంద్రబాబు సెక్యూరిటీని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చారు. ఆయనకు నక్సలైట్లు, ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి ఉన్న ముప్పు.. గతంలో జరిగిన దాడులు, మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్న కారణంగా.. కేంద్రం ఆయన జడ్‌ప్లస్ సెక్యూరిటీని కల్పించింది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌ రక్షణ ఉంటుంది. అయితే.. అసలు రక్షణ బాధ్యత మాత్రం.. రాష్ట్ర ప్రభుత్వానిదే. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం.. ఎన్‌ఎస్‌జీ ఉంది కదా.. మేమెందుకు సెక్యూరిటీ ఇవ్వాలన్నట్లుగా కోర్టులో వాదించింది. భద్రత విషయంలో చంద్రబాబు వేసిన పిటిషన్‌పై.. హైకోర్టులో ప్రభుత్వం .. అదే పనిగా మాటలు మార్చిందనే.. విమర్శలు వినిపిస్తున్నాయి.

మొదట చంద్రబాబుకు ఇవ్వాల్సిన సెక్యూరిటీ కంటే.. ఎక్కువే ఇస్తున్నామని… రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై సమగ్ర సమాచారంతో.. ప్రమాణపత్రం దాఖలు చేయాలని.. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కానీ అడ్వకేట్ జనరల్ అలాంటి.. ప్రమాణపత్రం దాఖలు చేయలేదు. చంద్రబాబు భద్రత.. ఎన్‌ఎస్‌జీదేనని వాదించారు. దాంతో.. కేంద్రం తరపున అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. మోబిలిటీలో మాత్రమే ఎన్ ఎస్ జి చంద్రబాబు భద్రత భాద్యతలు చూసుకుంటుందని, నివాసం, ఆఫీసుల్లో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వమే భద్రత కల్పించాల్సి ఉందన్నారు. ఈ మేరకు నిబంధనలు చూపించారు.

2004-14 మధ్య ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ చంద్రబాబుకు ఇద్దరు సిఎస్ ఓలతో భద్రత కల్పించగా దానిని ప్రస్తుతం ఒక్కరికి కుదించారనే విషయాన్ని న్యాయమూర్తి ముందు చంద్రబాబు తరపు న్యాయవాది ఉంచారు. దీనిపై ప్రభుత్వం ప్రస్తుతం ఓ సీఎస్‌వో ఇరవై నాలుగు గంటలూ పని చేస్తున్నారని.. వాదించింది. ఇరవై నాలుగు గంటలూ ఒకే సీఎస్‌వో ఎలా విధులు నిర్వహిస్తారని.. కోర్టు ప్రశ్నించడంతో.. ప్రభుత్వ న్యాయవాదుల వద్ద సమాధానం లేకపోయింది. రాజకీయ కారణాలతో తన భద్రతను తగ్గించారని.. కుటుంబ సభ్యులకు భద్రత తగ్గించారని.. పునరుద్దరించేలా ఆదేశించాలని.. చంద్రబాబు తరపున న్యాయవాదులు కోరారు. కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అయితే.. చంద్రబాబు భద్రత మొత్తం ఎన్ఎస్‌జీ బాధ్యతన్నట్లుగా .. ఏపీ పోలీసులు మాట్లాడటం.. భద్రత తగ్గించలేదని చెబుతున్నా.. పూర్తి వివరాలు వెల్లడించడానికి సిద్ధపడకపోవడంతో.. రాజకీయవర్గాల్లో చర్చకు కారణం అవుతోంది. చంద్రబాబు భద్రతను ప్రశ్నార్థకం చేసి.. ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోందన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close