దాసరిగా మారిన చిరు

పరిశ్రమకు ఓ పెద్ద దిక్కు అవసరం అన్నది చాలా మంది `పెద్దల` మాట. దాసరి నారాయణ రావు లేని లోటు కనిపించినప్పుడల్లా ఈ మాటే వినిపించేది. దాసరి స్థానంలో తప్పకుండా ఒకరు రావాలని అంతా కోరుకునేవారు. ఆ ఒక్కరు చిరంజీవి అయితే బాగుంటుందని అందరి ఉవాచ.

చిరంజీవి కూడా అలాంటి ప్రయత్నాలు చేశారు కూడా. పరిశ్రమలో చిన్న చిన్న గొడవలు రేగినప్పుడు (ముఖ్యంగా మా గొడవ) చిరంజీవి సర్దుబాటు చేసేందుకు ముందుకొచ్చారు. చిన్న సినిమాలు బాగా ఆడినప్పుడు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాటిని అభినందించి, ప్రమోషన్లు కల్పించారు. మరీ ముఖ్యంగా ఆడియో, ప్రీ రిలీజ్ వేడుకలకు ముఖ్య అతిథిగా అవతారమెత్తి దాసరి లేని లోటుని తీర్చారు.

అయితే చిత్రసీమకు ఇప్పుడు అసలు సిసలు ఆపద వచ్చింది.కరోనా వల్ల… షూటింగులు ఆగిపోయి, ఆ ప్రభావం రెక్కాడితే గానీ డొక్కాడని కార్మికులపై పడింది. పేద కళాకారుల జీవితం అస్తవ్యస్తమైంది. ఈ పరిస్థితుల్లో సీసీసీ అనే సంస్థకు నాంది పలికి ఓ గొప్ప పనికి పూనుకున్నారు చిరు. ఈ విషయంలో పరిశ్రమలోని ఇతర పెద్దల్ని కలుపుకుపోయిన విధానంలో దాసరిని మరిపించారు చిరు. కరోనా వ్యాధి నివారణలో భాగంగా షూటింగుల్ని వాయిదా వేసిన తొలి కథానాయకుడు చిరునే. ఆరకంగా మిగిలిన వాళ్లందరికీ స్ఫూర్తి నిచ్చాడు. కార్మికుల కోసం పెద్ద మొత్తంలో డొనేషన్ అందించిన హీరో కూడా చిరంజీవినే.

ఇప్పుడు కరోనాపై ఓ పాట వచ్చింది. ఇందులో చిరు, నాగ్, సాయిధరమ్, వరుణ్ తేజ్ లు కనిపించారు. కోటి స్వరపరిచిన పాట ఇప్పుడు వైరల్ అవుతోంది. అసలు ఇలా ఓ పాట కంపోజ్ చేయించాలని, అందులో హీరోలు కనిపించాలనే ఆలోచన కూడా చిరుదే. మొత్తానికి ఆపద కాల సమయంలో చిత్రసీమని సంఘటిత పరిచి, ఓ పెద్ద దిక్కులా వ్యవహరించారు చిరు. ఈ విషయంలో చిరు `దాసరి` పాత్ర పోషించారనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఇక ముందు దాసరి లేని లోటు కనిపించదేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close