వరద బాధితులంతా హ్యాపీగా ఉన్నారా ? ఇదేం ఆత్మవంచన !

రాయలసీమ, నెల్లూరు జిల్లాలో వరదలు వచ్చినా అసెంబ్లీ కనీసం పట్టించుకోదు. కనీసం వాయిదా కూడా వేసుకోలేదు. సీఎం జగన్ ప్రత్యక్ష పర్యటనకు వెళ్లలేదు. కానీ చివరి రోజు అసెంబ్లీలో వరదల అంశంపై మాట్లాడిన సీఎం.. వరద బాధితులందరికీ సాయం చేసేశామని.. వారంతా హ్యాపీగా ఉన్నారని స్పష్టం చేశారు. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డితోనూ వరద బాధితులు ఎలా ఉన్నారో జగన్ చెప్పించారు. అధికారులు తీసుకున్న చర్యలతో వరద బాధితులు హ్యాపీగా ఉన్నారని ఆయన కూడా సర్టిఫికెట్ ఇచ్చారు.

నిజంగా పాలకులు అనే వారికి కనీస మనసు ఉంటే.. చలించే తత్వం ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడనే మాట్లాడరు. ఎందుకంటే వరద దెబ్బకు సర్వం కోల్పోయిన వారికి ప్రభుత్వం టార్పాలిన్లు మాత్రమే ఇచ్చింది. వారికి కూడు, గుడ్డ, నీరు లేకుండా.. ఎవరో వచ్చే దాతలు ఇచ్చే వాటితో వారు సంతృప్తి పడతారా ?. ఇప్పటికే అనేక కాలనీలు నీళ్లలో ఉన్నాయి. అనేక మంది రేపేమిటి అని బాధపడుతున్నారు. గల్లంతయి ఇప్పటికీ ఆచూకీ తెలియని వారి సంఖ్య పదమూడు అని అక్కడి పోలీసు అధికారులు స్పష్టం గా చెబుతున్నారు. ఆ కుటుంబాల వేదన గురించి కనీసం పాలకులు ఆలోచించలేదు.

కొన్ని వందల కుటుంబాలు.. రోడ్డున పడ్డాయి. కొన్ని వేల కుటుంబాలు నష్టపోయాయి. ప్రభుత్వం ఇచ్చే రూ. వెయ్యి.. రెండు వేలతో వారు సంతృప్తి పడే అవకాశాలే లేవు. ముందు ప్రభుత్వం వారికి భరోసా కల్పించాల్సి ఉంది. కానీ కొంత ధన సహాయం చేసి దానితో వారంతా సంతృప్తిగా ఉన్నారని పాలకులు ప్రకటించేస్తున్నారు. బాధితుల పట్ల ఇంత నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించే సర్కార్ గతంలో ఉండదేమో అన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.

నిజానికి కలెక్టర్ , మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా ఎవరు బాధితుల వద్దకు వెళ్లినా వాళ్లకు తీవ్రమైన నిరసన ఎదురవుతోంది. అందుకే ఎవరూ వెళ్లడానికి సాహసించడం లేదు. ఎవరూ తమను పట్టించుకోవడం లేదని బాధితులు మీడియా ముందు ఆందోళనచెందుతున్నారు. కానీ పాలకులు మాత్రం అసెంబ్లీలో పొగడ్తలు వినిపించుకుంటూ.. మనసు నింపుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close