పనితనం ఫ్లోటింగ్ బ్రిడ్జి రూపంలో కళ్ల ముందే – గ్రాఫిక్స్‌ చూపిస్తే నవ్వుకోరా !?

సీఎం జగన్మోహన్ రెడ్డి పని తనం ఏమిటో ఈ ఐదేళ్లలో ప్రజలు చూశారు. కూల్చడమే తప్ప కట్టని పని తనం చూశారు. కట్టక కట్టక.. ఫ్లోటింగ్ బ్రిడ్జి కడితే .. ఏమయిందో కళ్ల ముందే ఉంది. అది పనికి రాదని పక్కన పెట్టేశారు. ఇక ఓపెనింగ్ చేయడం లేదని బోర్డు పెట్టారు. ఇలాంటి పనితనం కళ్లముందే ఉన్నా.. ఎన్నికలకు వెళ్లే ముందు తాను చేసే అభివృద్ధి .. ఓ రేంజ్ లో ఉంటుందని గ్రాఫిక్స్ చూపించాలని తాపత్రాయపడ్డారు. తాము గతంలో గ్రాఫిక్స్ విషయంలో చేసిన ట్రోలింగ్స్ అన్నీ మర్చిపోయి తాము కూడా గ్రాఫిక్స్ రిలీజ్ చేసేశారు.

సీఎం జగన్ విశాఖ విజన్ పేరుతో విడుదల చేసిన గ్రాఫిక్స్ చూసి.. వైసీపీ వాళ్లు కూడా నవ్వుకుంటున్నారు. గ్రాఫిక్స్ బాగున్నాయంటూ సెటైర్లు వేసుకుంటున్నారు. విశాఖలో విజన్ విశాఖ అనే మీటింగ్ పెట్టి.. అమరావతిపై విషం చిమ్మారు. అక్కడ లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టాలన్నారు. కానీ.. ఇదే జగన్ పదేళ్లలో విశాఖలో లక్షా ఐదు వేల కోట్లు పెడతామన్నారు. విశాఖకు అన్నీ ఉన్నాయి.. ఏవో కొన్ని కడితే సరిపోతాయన్నారు. కానీ లక్షా ఐదువేల కోట్లు పెడతామనడమే ఆశ్చర్యం.

అమరావతికి ఏడాదికి ప్రభుత్వం పెద్దెనిమిది వందల కోట్లు పెడితే..మిగతా అంతా.పెట్టుబడుల రూపంలో ప్రైవేటు వ్యక్తులు పెడతారు. ఆ విషయం మాస్టర్ ప్లాన్లో ఉంది. అయినా అబద్దాలు చెప్పుకుంటూ ఒక ప్రాంతానికి.. మరో ప్రాంతానికి మధ్య చిచ్చు పెట్టేలా రాజకీయం చేస్తున్నారు. ఐదేళ్లలో కొంచెం అయినా పని చేసి ఉంటే.. ఏదో ఒకటి అభివృద్ది చేసి ఉంటే.. ప్రజలు కనీసం నవ్వుకోకుండా ఉండేవారేమో ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: దిల్ రాజు బ్యాన‌ర్‌లో ధ‌నుష్‌

ధ‌నుష్ ఈమ‌ధ్య తెలుగు ద‌ర్శ‌కులు, తెలుగు నిర్మాత‌ల‌పై దృష్టి పెట్టాడు. 'సార్' అలా వ‌చ్చిందే. ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి ఫ‌లితాన్ని అందుకొంది. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో 'కుబేర‌' చేస్తున్నాడు....

ఇస్మార్ట్… ప‌ట్టాలెక్కింది!

రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌చ్చిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఇన్‌స్టెంట్ హిట్ అయిపోయింది. రామ్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని అందుకొన్న సినిమా ఇది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'డ‌బుల్ ఇస్మార్ట్'...

అక్ష‌య్ ప‌ని పూర్త‌య్యింది.. మ‌రి ప్ర‌భాస్ తో ఎప్పుడు?

మంచు విష్ణు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం 'క‌న్న‌ప్ప‌'. ఈ సినిమాలో చాలామంది పేరున్న స్టార్స్ క‌నిపించ‌బోతున్నారు. అందులో ప్ర‌భాస్ ఒక‌డు. ఈ చిత్రంలో ఆయ‌న నందీశ్వ‌రుడిగా అవ‌తారం ఎత్త‌బోతున్నారు. అక్ష‌య్ కుమార్...

“ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్” చుట్టూ ఏపీ రాజకీయం !

ఆంధ్రప్రదేశ్ రాజకీయం క్లైమాక్స్ కు చేరుతుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా అందరి నోట్ల నలుగుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయం నడుస్తోంది. ఆ చట్టంలో ఉన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close