నాలుగున్న‌రేళ్ల వైఫ‌ల్య పాఠమిది.. జ‌గ‌న్ కి అర్థ‌మౌతోందా..?

కుట్ర భగ్నమైంద‌నీ, బంద్ విజ‌య‌వంత‌మైంద‌నీ వైకాపా నేత‌లు గొప్ప‌గా చెప్పుకోవ‌చ్చు! ఆంధ్రుల ఆక్రోశంపై ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపిందంటూ బంద్ వైఫ‌ల్యానికి ఇగో శాటిస్ఫై చేసే సాకులు వెతుక్కోవ‌చ్చు. చంద్ర‌బాబు నాయుడుని భావిత‌రాలు క్ష‌మించ‌వంటూ ఆవేశ‌పూరితంగా ఎన్ని ప్ర‌క‌ట‌న‌లైనా చెయ్యొచ్చు. కానీ.. వీట‌న్నింటినీ దాటి వైకాపా అధినేత జ‌గ‌న్ నేర్చుకోవాల్సిన ఒక ముఖ్య‌మైన పాఠాన్ని బంద్ ఫ‌లితం చాటి చెబుతోంది. కేవ‌లం చంద్ర‌బాబును విమ‌ర్శించ‌డ‌మ‌నే కోణాన్ని కాసేపు ప‌క్క‌నబెట్టి… జీరో ఎమోష‌న్స్ తో ఆలోచిస్తే వైపాకా ఇచ్చిన ఈ బంద్ పిలుపు అనేది.. నాలుగేళ్ల ప్ర‌తిప‌క్ష పార్టీ ప‌నితీరుకి ప్రోగ్రెస్ కార్డులా చాలా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైకాపా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లే అజెండాలుగా వారికి ఉండాలి. అలాంట‌ప్పుడు, ప్ర‌జ‌ల త‌ర‌ఫున చేసే అన్ని పోరాటాల‌కూ భావ‌సారూప‌త్య క‌లిగిన పార్టీల‌ను క‌లుపుకుని వెళ్లాలి. జ‌గ‌న్ పిలిస్తే ప‌వ‌న్ వ‌స్తారా, మ‌రొక‌రు రారా అనే చ‌ర్చ త‌రువాత‌! అస‌లు పిల‌వ‌డ‌మంటూ జ‌ర‌గ‌లేదు జగన్ వైపు నుంచి ఉంటే క‌దా! నాలుగున్న‌రేళ్ల‌లో ఆంధ్రాలో ప్ర‌తిప‌క్షాల‌ను… మ‌రీ ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబును తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న ఇత‌ర పార్టీల‌ను ఒక వేదికపైకి తేవ‌డంలో జ‌గ‌న్ ఘోరంగా విఫ‌లమయ్యారు.

కేంద్రం కాంగ్రెస్ పార్టీనే ఒక్కసారి చూడండి. ఇత‌ర పార్టీల‌తో విభేదాలున్నా… ఎప్ప‌టిక‌ప్పుడు విందుల‌నీ, ఇతర స‌మావేశాల‌నీ క‌లుపుకునే ధోర‌ణిలోనే ఉంటోంది. భాజ‌పాపై పోరాటం అనేస‌రికి త‌మ‌తో ఎంతమంది వ‌స్తారా రారా అనేది ప‌క్క‌న‌బెట్టి… అన్ని పార్టీల‌నూ పిలుచుకుని ముందుకు సాగుతోంది. ఇలాంటి ప్ర‌య‌త్నం ఆంధ్రాలో జ‌గ‌న్ ఒక్క‌సారైనా చెయ్య‌లేదు. నాలుగున్న‌రేళ్ల‌లో ఇత‌ర పార్టీల‌తో క‌లిసి, ప్రజా స‌మ‌స్య‌లపై ఒక్క‌టంటే ఒక్క స‌మావేశం కూడా నిర్వ‌హించిన ట్రాక్ రికార్డు లేదు. చంద్ర‌బాబుపై పోరాడితే… ఆ ఫ‌లితం త‌మ‌కు మాత్ర‌మే ద‌క్కాల‌న్న రాజ‌కీయ ల‌బ్ధి బుద్ధితోనే ప్ర‌తిప‌క్ష నేత‌గా కాలం వెళ్ల‌దీశారే త‌ప్ప‌… ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చిత్త‌శుద్ధితో పోరాడుతున్నామ‌నే విధానాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌లేక‌పోయారు.

నిన్న‌టి బంద్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. త‌నుకు తానుగా బంద్ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించేసి… ఇత‌ర పార్టీలు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌ని త‌రువాత వ్యాఖ్యానిస్తే ఏం ప్ర‌యోజ‌నం? టీడీపీని జ‌న‌సేన వ్య‌తిరేకిస్తోంది, భాజ‌పా వైరిప‌క్షంగా చూస్తోంది, కాంగ్రెస్ కూడా పోరాట‌మంటోంది… అయినాస‌రే, ఏ ఒక్క‌రూ వైకాపా చేసిన బంద్ కి మ‌ద్ద‌తు ఇవ్వ‌లేదు. ఎందుకు ఇవ్వ‌లేదు అనేది వైకాపా శ్రేణులు విశ్లేష‌ణ చేసుకుంటే… జ‌గ‌న్ ఒంటెద్దు పోక‌డ‌లు అనేది చాలాచాలా స్ప‌ష్టంగా అర్థ‌మౌతుంది. ఏం చేసినా త‌మ‌కు మాత్ర‌మే ద‌క్కాలి, ఇత‌రుల‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌కూడ‌ద‌న్న మైండ్ సెట్ తో ఎన్ని పోరాటాలు చేసినా ఏం ప్ర‌యోజ‌నం..? దాన్లో వైకాపా స్వార్థ‌మే క‌నిపిస్తుంది త‌ప్ప‌, ప్రజా స‌మ‌స్య‌ల‌పై ఉన్న చిత్త‌శుద్ధి బ‌య‌టప‌డ‌దు. మరో ఎన్నికల కోసం ఎదురుచేశారే తప్ప… ప్రతిపక్ష పార్టీగా బాధ్యతాయుతంగా వ్యవహరించారా లేదా అనేది వారే విశ్లేషించుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close