ఎమ్మెల్సీ రిజల్ట్స్ తర్వాత కేసీఆర్ వ్యూహం మార్చారా..?

తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఫలితాలు రాజకీయ వాతావరణాన్ని మార్చే పరిస్థితి కనిపిస్తోంది. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన పాతూరి సుధార్ రెడ్డి, పూల రవీందర్ టీఆర్ఎస్ పార్టీ సభ్యులుగా కొనసాగారు. పాతూరి సుధాకర్ రెడ్డికి శాసన మండలిలో ఛీప్ విఫ్ పదవి ఇచ్చారు కెసీఆర్. పూల రవీందర్ సైతం పార్టీ వాణిని అనేక వేదిక‌ల్లో గట్టిగానే వినిపించేవారు. ఇప్పుడు ఇద్దరూ ఉపాధ్యాయుల ఆగ్రహం చవిచూశారు. పట్టభద్రుల కోటా ఎన్నికల్లోనూ చంద్రశేఖర్ గౌడ్ టీఆర్ఎస్ మద్దతుతో బరిలో నిలిచి గెలుపు ఖాయమనుకున్నారు. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలిచిన స్వామిగౌడ్ దేశంలోనే మండలి ఎన్నికల్లో అత్యధిక మెజార్జీ సాధించారు. ఈసారి మాత్రం చంద్రశేఖర్ గౌడ్ భారీ ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. నిరుద్యోగులు, విద్యావంతులకు ప్రభుత్వంపై ఉన్న వ్యవతిరేకత ఈ ఫలితాలకు అద్దం పట్టింది.

పార్లమెంటు ఎన్నికల హడావుడి నడుస్తోంది. 16 సీట్లు సాధించాలనే లక్ష్యంగా ముందుకెళ్తున్న గులాబీ పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చినట్లయింది. ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న టీఆర్ఎస్ కు ఇలాంటి పలితాలు రావడం ఊహించని పరిణామంగా పార్టీ నేతలు భావిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఈ ఫ‌లితాల ప్రభావం పడుతుందనే భయం నేతలను వెంటాడుతోంది. మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్ సైతం ఈ ఓటమిపై సమీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం పై ఉద్యోగుల్లో, మేధావుల్లో , నిరుద్యోగ, విద్యార్ది లోకంలో ఉన్న వ్వతిరేక‌త ఈ మూడు ఫలితాల ద్వారా స్పష్టమైందని అంచనాకు వచ్చారు.

అందుకే… పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఆయన వ్యూహం మార్చబోతున్నారని అంటున్నారు. అయితే.. కేసీఆర్ ఎప్పుడూ.. బుజ్జగించే.. రాజకీయ వ్యూహాలను అమలు చేయరు. ఉద్యోగుల విషయంలో తాను వ్యవహరిస్తున్న తీరు కరెక్టే అనేలా.. ఆయన.. రాజకీయ వ్యూహం అవలంభించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కేసీఆర్ పదహారు సీట్ల లక్ష్యంలో.. ఇప్పుడు… ఓ సవాల్ అయితే వచ్చి పడింది. దాన్ని ఎలా ఎదుర్కోవాలన్నది కేసీఆర్‌కు బాగా తెలిసిన విషయమే కావొచ్చు..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close