అగ్రిగోల్డ్ బాధితులకు వెయ్యి కోట్లు చెల్లించేందుకు ఈడీ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. మనీ లాండరింగ్ కింద ఈడీ గతంలో కేసు నమోదు చేసి ఆస్తుల్ని చేసింది. వాటిలో ప్రభుత్వ విలువ ప్రకారం రూ. 691 కోట్ల విలువ ఉన్న ఆస్తులను వేలం వేసి బాధితులకు చెల్లించేందుకు ఈడీ అంగీకరించింది. ఈ మేరకు కోర్టులో పిటిషన్ వేసి ఆమోదం తీసుకుంది.
ప్రభుత్వ విలువ ప్రకారం రూ. 691 కోట్లు అంటే బహిరంగ మార్కెట్లో వెయ్యి కోట్లకుపైగానే ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఈ మొత్తం బాధితులకు ఇవ్వనున్నారు.
ఈడీ ఫిబ్రవరి రూ.6,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అాటాచ్ చేసింది. త్వరలో మిగతా ఆస్తులను కూడా వేలం వేసి బాధితులందరికీ పంపిణీ చేసే అవకాశం ఉంది. అగ్రిగోల్డ్ సంస్థ ఏజెంట్లను నియమించుకుని 32 లక్షలకు పైగా పెట్టుబడిదారుల నుండి దాదాపు రూ.6,380 కోట్లు వసూలు చేశారు. ఎవరికీ తిరిగి చెల్లింపులు చేయలేదు .
తెలుగుదేశం హయాంలో ఆస్తులను వేలం వేసి అందరికీ చెల్లించాలనుకుంటే వైసీపీ నాయకులు కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారు. చివరికి కొంత మొత్తం చెల్లించడానికి కోర్టులో జమ చేశారు. కానీ ప్రభుత్వం మారింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. తాము రాగానే తొలి బడ్జెట్లో రూ.1150 కోట్లు ఇస్తామని జగన్ నమ్మించారు. బడ్జెట్ లో పెట్టారు కానీ రూపాయి కూడా ఇవ్వలేదు. టీడీపీ హయాంలో కోర్టులో జమ చేసిన వాటిని మాత్రం రిలీజ్ చేసి ప్రచారం చేసుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితుల్ని నిలువునా ముంచారు.
ఈడీని ఒప్పించి ఆస్తులన్నీ వేలం వేసి బాధితులందరికీ న్యాయం చేయాలని టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.