జమిలీకి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం..!

దేశంలో జమిలీ ఎన్నికలపై చర్చ అంతకంతకూ పెరుగుతోంది. సాక్షాత్తూ ప్రధానమంత్రి జమిలీ ఎన్నికల అవసరం గురించి గట్టిగా చెప్పిన తర్వాత రాజకీయ పార్టీల్లో దీనిపై మరింత చర్చ జరుగుతోంది. అధికారంలో లేని వారు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని సహజంగానే వస్తూంటారు. దాంతో వారు ఆసక్తిగానే ఉన్నారు. కానీ అధికారం ఇంకా మిగిలిన ఉన్న వాళ్లు మాత్రం జమిలీ రాదనే అనుకుంటున్నారు. కానీ పరిస్థితులు మాత్రం అలా లేవు., కేంద్రం చాలా సీరియస్‌గా జమిలీ ఎన్నికల గురించి చర్చిస్తోందన‌్న ప్రచారం ఊపందుకుంటుంది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా.. ఈ అంశంపై ప్రకటన చేసింది. జమిలీ ఎన్నికల నిర్వహణకు తాము సిద్దంగా ఉన్నామని.. పార్లమెంట్‌లో ఎప్పుడు రాజ్యాంగ సవరణ చేస్తే.. అప్పుడు ఎన్నికలు నిర్వహించేస్తామని ప్రకటించింది.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ఈ మేరకు ప్రకటన చేశారు. భారతీయ జనతా పార్టీ ఒక దేశం – ఒకే ఎన్నికలు అనే విధానాన్ని తేవాలని పట్టుదలగా ఉంది. అందు కోసం… ఓ ప్రణాళిక ప్రకారం నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తోంది. కరోనా కారణంగా ఆ ప్లాన్లను వాయిదా వేస్తారని చాలా మంది అనుకున్నారు. కానీ అలాంటి ఆలోచన లేదని.. వెనుకడుగు వేసే అవకాశం కూడా లేదన్న అభిప్రాయం బీజేపీ నేతల్లో కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభమయింది. పార్లమెంట్, అసెంబ్లీ, పంచాయతీ, మున్సిపాలిటీ ఇలా ప్రతి ఒక్క ఎన్నికకు ఒకే సారి ఎన్నిక జరగాలనేది మోదీ అభిలాష. అలా జరిగితే.. మళ్లీ మళ్లీ ఎన్నికలన్న ప్రస్తావన రాదని.. అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టవచ్చని చెబుతున్నారు.

కానీ ఇందులో మౌలికమైన సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే లా కమిషన్ వేసి.. దీనిపై కొన్ని ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. ముందస్తుగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే.. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల పదవీ కాలాన్ని తగ్గించాలని.. మరికొన్నింటినీ పొడిగించాల్సి ఉంటుంది. దీని కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం.. కేంద్రం తల్చుకుంటే.. రాజ్యాంగ సవరణ సులువే. అందుకే.. ఇలాంటి అవకాశం మళ్లీ రాదని.. ఎట్టి పరిస్థితుల్లోనూ జమిలీ ఎన్నికలు పెట్టాలన్న ఆలోచన చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈసీ స్పందన కూడా అందులో భాగమేనని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close