ఒక సందర్భం…ఒక ఆలోచన…ఒక సంస్మరణ

భారత ప్రధాని నరేంద్రమోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఉదయమే గాంధీజీ కి నివాళులు అర్పించారు. ఈ ఇద్దరితో సహా వేర్వేరు స్ధాయిల్లో విధాననిర్ణయాలు తీసుకోగల అధికారంలో వున్న వేలవేల మంది నాయకులెవరూ వర్తమాన సమాజానికి గాంధేయ ప్రత్యామ్నాయాల గురించి ప్రస్తావించడమే లేదు. అసలు ఆ ప్రత్యామ్నాయాలు ఇపుడు పనికివస్తాయా పనికిరావా అన్న చర్చకు కూడా ఎవరూ దారితీయడమేలేదు. గ్లోబలైజేషన్ ప్రక్రియలో హేతుబద్ధత గురించి ప్రస్తావన వచ్చినపుడు భారీ పారిశ్రామికీకరణ మీద గాంధీజీ అభిప్రాయాలు గుర్తుకిరాక తప్పదు. భారీ పరిశ్రమలు భారీ పెట్టుబడులపై ఏ నాయకుడైనా సరేపనిచేసేవారిపై పెట్టుబడిదారుల పెత్తందారీతనాన్ని విమర్శిస్తారు. అందులోవున్న ఉత్పాదక సాధనాలను విమర్శించజాలరు. ఒక్క గాంధీజీ మాత్రమే భారీ పరిశ్రమలను అన్ని విధాలా వ్యతిరేకించారు. సమాజం అంతటికీ చెందవలసిన సహజవనరుల ప్రయోజనాలను భారీయంత్రాలు కొద్దిమంది పెట్టుబడిదారులముందే పోగులు పెడతాయని, ఇది మనిషికి, అతని ఉత్పత్తులకు సాధనాలైన పనిముట్లకు మధ్యగల అనురాగాన్ని ధ్వంసం చేస్తుందని గాంధీజీ నిస్సంకోచంగా చెప్పారు.

ఉపాధికల్పించలేని సమాజాలలో, అతికొద్దిమంది వనరులను స్వాధీనం చేసుకుని అనుభవిస్తుండగా పేద,ధనిక తారతమ్యాలు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో గాంధీజీ ఆలోచనకు ఎంతైనా ప్రాధాన్యత వుంది. వందలఏళ్ళ పరాయీకరణవల్ల సమాజాలు ఆలోచించడం మరచిపోయిన పుడు గాంధీజీ ఆలోచించడం మొదలుపెట్టారనిపిస్తోంది. అహింస, సహనాలను ఆయన పరిశీలననుంచీ, అనుభవాలనుంచీ నేర్చకున్నారు. ఆయన దక్షిణాఫ్రికాలోని ఫీనిక్స్ నివాసముంటున్నపుడు ఒకసారి తాను చెప్పిన మాట వినలేదని కస్తూర్బా ను కొట్టి, బయటికి నెట్టేశారట. ఆమె తెల్లవార్లూ చలిలో నిలబడి వుండటాన్ని తలుపుతీశాక గమనించారు. ఆమె సహనమే ఒక శక్తి అనీ, బాధను భరించడం కూడా ఒక ఆయుధమేననీ తెలుసుకున్నారు. సత్యాగ్రహభావనకు ఈ సంఘటనే గాంధీజీకి ప్రేరణ అయ్యింది.

అహింసా మార్గంలో స్వాతంత్రం సాధించిన భారతదేశంలో గాంధీజీ విస్తృతమైన ప్రజామోదం పొందారు. అదేపద్ధతిలో ఆఫ్రికాను బ్రిటీష్ వారినుంచి విముక్తిచేసిన నెల్సన్ మండేలా. ఇక్కడ చిన్నతేడా కూడా వుంది. ఇండియా నుంచి బ్రిటీష్ వారు వెళ్ళిపోయారు. ఆఫ్రికాలో వారు అధికారం నుంచి దిగిపోయినా అక్కడి సమాజంలో భాగమైపోయారు. ప్రజలకు సాధికారికత కల్పించడంలో భారత్ కంటే ఆఫ్రికా ముందు వుంది. అక్కడ అధికారం మార్పిడి సామాజిక న్యాయం ద్వారా జరగడమే ఇందుకు కారణం కావచ్చు!

భారతదేశం వంటి బహుమత, కుల,వర్గ, సాంస్కృతిక సమాజాన్ని ఏకతాటి మీద నడిపించే నాయకుల విఫలప్రయత్నాలవల్ల గాంధేయ సిద్ధాంతాలు కొంత యధాతధవాదంగా, కొంత సామరస్యవాదంగా, కొంత పరివర్తనవాదంగా మారిపోయినట్టు అర్ధమౌతోంది.

ఏమైనాగానీ, ఐన్ స్టీన్ అన్నట్టు ”ఈవ్యక్తి రక్తమాంసాలతో ఈనేలపై నడయాడాడా అని భవిష్యత్తులో ప్రజలు ఆశ్చర్యపోతారు” అన్నంత వున్నతమైనది…గాంధీజీ వ్యక్తిత్వం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close