కవిత కోసం బీజేపీకి కేసీఆర్ సరెండర్ అయ్యారా..?

లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితను కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రధాని మోడీతో కుమ్మక్కయ్యారా..? అందులో భాగంగానే ఐదు లోక్ సభ స్థానాల్లో బీజేపీకి సహకరించేందుకు కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారా..? రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ను కూల్చాలని కేసీఆర్ బీజేపీతో కలిసి కుట్రలు చేస్తున్నారా..?

అంటే అవుననే అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సోమవారం నారాయణపేట జన జాతర సభలో ప్రసంగిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన కూతురు జైలు పాలైతే ఆమెను కాపాడుకునేందుకు బీజేపీతో జత కట్టారని ఆరోపించారు. బిడ్డను కాపాడుకునేందుకు ప్రధాని నుంచి సుపారీ తీసుకున్నారని ఆరోపించిన రేవంత్…అందులో భాగంగా చేవెళ్ల ,మల్కాజ్ గిరి , జహీరాబాద్, మహబూబ్ నగర్, భువనగిరి లోక్ సభ స్థానాల్లో కేసీఆర్ డమ్మీ అభ్యర్థులను పోటీలో పెట్టారన్నారు.

తనను పడగొట్టేందుకు కేసీఆర్ , నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఓ వైపు బీఆర్ఎస్ , బీజేపీ నేతలు ఎక్ నాథ్ షిండే వ్యాఖ్యలు చేస్తుండటంతో రేవంత్ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు మల్కాజ్ గిరి , సికింద్రాబాద్ స్థానాల్లో బీజేపీకి సహకరించేందుకు కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను బరిలో నిలిపిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా… బీజేపీ గెలుపు కోసం కేసీఆర్ సుపారీ తీసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్.

లిక్కర్ స్కామ్ లో కవిత బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయినా ఆమెకు ఊరట లభించడం లేదు. ఇప్పటికప్పుడు ఆమెకు బెయిల్ లభించే అవకాశం కనబడటం లేదు. ఈ కేసు రాజకీయ ప్రేరేపితమైందని ఆరోపణల నేపథ్యంలో రేవంత్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. నిజంగానే కవిత కోసం మోడీతో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారా..? అనే చర్చ జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close