ఏపీ ప్రభుత్వ ఆన్‌లైన్ టిక్కెట్లపై హైకోర్టు స్టే !

టాలీవుడ్ కలెక్షన్స్ మొత్తం తన ఖాతాలో వేసుకుని .. వారిని గుప్పిట్లో పెట్టుకుందామనుకున్న ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో తాత్కాలికంగా ఎదురు దెబ్బ తగిలింది. ఈ రోజు నుంచే ఆన్ లైన్ టిక్కెట్లు అమ్మాలనుకున్నా.. హైకోర్టు స్టే ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సినిమా టికెట్ల కొత్త విధానం అమలు నిలిపేసిన న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేసింది.

సినిమాల టికెట్లను ప్రభుత్వమే విక్రయించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం గత ఏడాది కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు సవరణ చట్టం చేసి, ప్రభుత్వం టికెట్ల విక్రయాలపై ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బిగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేటు లిమిటెడ్‌, ఎగ్జిబిటర్లు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ లోపు ప్రభుత్వం.. ఇతర వెబ్ సైట్లలో కూడా టిక్కెట్లు కొనవచ్చని .. యువర్ స్క్రీన్స్ పేరుతో సొంత గేట్ వెట్ ఉంటుందని ప్రకటించింది. అయితేఇతర కంపెనీలుూ.. యువర్ స్క్రీన్స్ ద్వారానే టిక్కెట్లు అమ్మాలని నిర్దేశించింది. ఈ అంశాలపై హైకోర్టులో విచారణ జరిగింది.

ప్రస్తుతానికి కొత్త విధానం ప్రకారం ఏపీ సర్కార్ టికెట్లు విక్రయించకుండా తాత్కాలికంగా స్టే విధించింది. తాము జారీ చేసిన జీవో ప్రకారం ఎంవోయూ చేసుకోవాలని ఎగ్జిబిటర్లపై ఒత్తిడి తెచ్చారు. అయితే వారు చాలా వరకూ సంతకాలు చేయలేదు. ఎంవోయూ చేయకపోతే.. ధియేటర్లు సీజ్ చేస్తామని కూడా ప్రభుత్వం హెచ్చరించింది. అయినా ముందుకు రాలేదు. ఈ లోపే కోర్టు స్టే ఇచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close