ప్చ్.. టీం కోహ్లీ ! ఎంతో హైప్ ఇచ్చి.. తుస్‌మనిపించారు !

ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ అంటే రెండు దేశాల మధ్య యుద్ధమే అన్నంత షో చేశారు. మౌకా ..మౌకా యాడ్స్ ఇచ్చారు. సోషల్ మీడియాలో భావోద్వేగాలను పెంచారు. అయితే మ్యాచ్ మాత్రం సాదాసీదాగా అయిపోయింది. పాకిస్తాన్ ఆటగాళ్ల ముందు కోహ్లీ టీం తేలిపోయింది. అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్ మధ్య దేంట్లోనూ పాక్ ప్రమాణాలను అందుకోలేకపోయారు. క్రికెట్ చూడటం మానేసినచాలా మంది కూడా ఆదివారం టీవీల ముందు కూర్చున్నారు. కానీ తొలి ఓవర్లలోనే వారికి సీన్ అర్థమైపోయింది. ఏదో ఆశతో చివరి వరకూ చూసి ఉంటారు కానీ టీమిండియాపై ఎవరూ ఏ దశలోనూ ఆశలు పెట్టుకోలేదు.

ఆఫ్రిది పేరు వింటే అందరికీ ఓ స్టార్ బ్యాట్స్ మెన్ గుర్తుకు వస్తాడు. కానీ ఈ మ్యాచ్‌లో ఇంకో ఆఫ్రిది బుల్లెట్ల లాంటి బంతులతో దడ పుట్టించాడు. ఇతని ఆట తీరు మెచ్చే తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేసి.. అల్లుడ్ని చేసుకోవాలని ఆ ఆఫ్రిది కూడా నిర్ణయించుకున్నారు. ఇతర ఆటగాళ్లు కూడా ఏ మాత్రం తగ్గలేదు. కెప్టెన్ బాబర్ అజామ్ తన టాలెంట్ అంతా చూపించారు. ఇక్కడ జరిగిందేమిటంటే… పాకిస్తాన్ ఆటగాళ్లు ఏ దశలోనూ ఒత్తిడికి గురయినట్లుగా కనిపించలేదు. వాటి ఆట వారు ఆడారు.

కానీ ఇండియా ఆటగాళ్లకు ఆట ఎప్పుడో మారిపోయింది. అయితే ఐపీఎల్..లేకపోతే టూర్లు అన్నట్లుగా సాగిపోతుంది. ప్రతీ మ్యాచ్ వారికి ఓ రొటీన్ మ్యాచ్‌లాగే అయిపోయింది. ఇది ప్రత్యేకం అని టీం ఇండియా మెంబర్స్ ఎప్పుడైనా అనుకుంటే అది ఓటమికి దారి తీస్తోంది. ఆ ప్రభావం.. దుబాయ్‌లో స్పష్టం గా కనిపించింది. వరల్డ్ కప్‌లో ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ వస్తే కప్పు గెలవకపోయినా పర్వాలేదు.. మ్యాచ్ గెలవాలని రెండు దేశాల్లో క్రికెట్ అభిమానులు అనుకుంటారు. ఆ రకంగా పాకిస్తాన్ కప్పు గెలిచినట్లే. ప్రపంచకప్‌లో ఐదు సార్లు పాకిస్తాన్‌ను ఓడించించిన ఇండియా టీంకు ఈ సారి అదృష్టం కలసి రాలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close