ఈ క‌థ‌కి శ‌ర్వానంద్ సెట్ అవుతాడా?

ర‌వితేజ నుంచి నాగ‌చైత‌న్య‌కు, నాగ‌చైత‌న్య నుంచి కార్తికేయ ద‌గ్గ‌ర‌కూ వెళ్లి.. చివ‌రికి శ‌ర్వానంద్ ముందు వాలింది మ‌హా స‌ముద్రం క‌థ‌. ఆర్‌.ఎక్స్ 100 త‌ర‌వాత ఈ క‌థ‌నే ప‌ట్టుకుని ఇండ్ర‌స్ట్రీ మొత్తం చ‌క్క‌ర్లు కొడుతున్నాడు ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. ఈ క‌థ హీరోలంద‌రికీ న‌చ్చేసింది కానీ, ఏవేవో కొన్ని కార‌ణాల వ‌ల్ల వ‌ర్క‌వుట్ కాలేదు. అన్నింటికంటే ఇది మ‌ల్టీస్టార‌ర్ స‌బ్జెక్టు. ఇద్ద‌రు హీరోల్ని ఒకేసారి వెదికి ప‌ట్టుకుని, క‌థ‌ని ప‌ట్టాలెక్కించ‌డం చాలా క‌ష్టం. అందుకే ఈ క‌థ ముందుకు వెళ్ల‌డం లేదు. శ‌ర్వా మాత్రం ఈ క‌థ‌కి ప‌చ్చ‌జెండా ఊపాడు. రెండో హీరోని వెదికి ప‌ట్టుకోవ‌డం అజయ్ భూప‌తికి పెద్ద క‌ష్ట‌మేం కాదు.

కాకపోతే… ఈ క‌థ శ‌ర్వానంద్‌కు సెట్ అవుతుందా, లేదా? అనేదే పెద్ద డౌటు. ఎందుకంటే ఇది మహా స‌ముద్రం అనేది మాస్ క‌మ‌ర్షియల్‌ సినిమా. ఇలాంటి మాస్ క‌థ‌లు ఎంచుకుని, ఇది వ‌ర‌కు చాలా త‌ప్పులు చేశాడు శ‌ర్వానంద్‌. 2019లో శ‌ర్వా ఖాతాలో ర‌ణ‌రంగం లాంటి డిజాస్ట‌ర్ ఉంది. మాస్‌ని మెప్పించ‌డానికి శ‌ర్వా చేసిన ప్ర‌య‌త్నాల్లో ఇదొక‌టి. ఇదే అని కాదు, ఇది వ‌ర‌కు ఇలాంటి క‌థ‌లెప్పుడు ఎంచుకున్నా, శ‌ర్వానికి స‌రైన ఫ‌లితాల్ని ఇవ్వ‌లేదు. 96, శ్రీ‌కారం లాంటి క్లాస్ ట‌చ్ ఉన్న క‌థ‌లైతే త‌న‌కు బాగా న‌ప్పుతాయి. ఈ టైమ్‌లో మ‌హా స‌ముద్రం స్క్రిప్టుని శ‌ర్వా ఎంత వ‌ర‌కూ సూట‌వుతాడ‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. అయినా స‌రే, మాస్ హీరోగా మెప్పించాల‌న్న త‌ప‌న‌తోనే ఈ క‌థ‌ని ఓకే చేశాడు శ‌ర్వా. ఈ సినిమా కూడా అటూ ఇటూ అయితే.. భ‌విష్య‌త్తులో శ‌ర్వానంద్ వీటి జోలికి వెళ్ల‌డేమో..??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close