అప్పట్లో పీడీ అకౌంట్ల గోల్‌మాల్.. ఇప్పుడు జరిగింది కూడా అదేనా..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 41వేల కోట్ల ప్రజాధనం గోల్ మాల్ చేసిందన్న ఆరోపణలు విస్తృతంగా వస్తున్నాయి. సాక్షాత్తూ అకౌంటెంట్ జనరల్ లేఖ రాయడం.. పీఏసీ చైర్మన్ గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతో సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. అయితే దీనిపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వివరణ ఇచ్చారు… ఆ వివరణలో పీడీ అకౌంట్ల ప్రస్తావన ఉంది. నిధుల్ని పీడీ అకౌంట్లకు మళ్లించారని.. ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి.. వాడని నిధులు మురిగిపోయాయని అంతే తప్ప.. ఎవరికీ మళ్లించలేదని చెప్పుకొచ్చారు. దీంతో టీడీపీ హయాలో జరిగిన పీడీ అకౌంట్ల రచ్చ మరోసారి ప్రజల మనసుల్లోకి వచ్చింది.

భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సంబంధించి ” పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్‌”లో భారీగా నిధులున్నాయని.. అంటే పెద్ద స్కామ్ జరిగిపోయినట్లేనని అప్పట్లో ఆరోపణలు చేశారు. దీనిపై టీవీ చానళ్లలో డిబేట్లు పెట్టారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. టీడీపీ నేతల పర్సనల్ ఖాతాలు అన్నట్లుగా జీవీఎల్ చెప్పడం… వైసీపీ మీడియా దాన్ని అదే పద్దతిలో ప్రచారం చేయడం జోరుగా సాగిపోయాయి. ఏదో అవినీతి జరిగిందే విషయాల్లో అర్థం కాని సాంకేతిక పదాలతో ప్రజల్లోకి తీసుకెళ్తే.. చాలు.. టూజీ స్కాంలా ఏమీ లేకపోయినా.. ప్రభుత్వంపై మచ్చ పడిపోతుందని.. అప్పట్లో వ్యూహం పన్నారు. దానికి తగ్గట్లుగానే ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు… అదే రూ. 41వేల కోట్ల గోల్ మాల్ తిరిగి వచ్చింది. పీడీ అకౌంట్లలో పెట్టామని అవి మురిగిపోయాయని చెబుతున్నారు.

విశేషం ఏమిటంటే.. అప్పట్లో పీడీ అకౌంట్లలో ఉన్న నిధుల గురించి చర్చ పెట్టింది బీజేపీనే. ఇప్పుడు… అలాంటి అకౌంట్లలో పెట్టి మురిగిపోయాయని చెబుతున్న ఏపీ సర్కార్ వాదనను ఖండించడానికో.. విమర్శలు చేయడానికో బీజేపీ నేతలు తెర ముందుకు రావడం లేదు. అసలు ఈ అంశంలో ఒక్క మాటంటే.. ఒక్క మాట బీజేపీ నేతల నుంచి రాలేదు. ప్రభుత్వానికి ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని వారు సైలెంట్‌గా ఉంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. గతంలో టీడీపీ హయాంలో ఏ రచ్చ అయితే చేశారో అవన్నీ ఇప్పుడు వైసీపీకి వరుసుగా రివర్స్ అవుతూండటం.. వైసీపీ నేతల్ని కూడా కంగారు పెడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి@ రూ.14 కోట్లు

ఓటీటీ మార్కెట్ ప‌డిపోయింద‌ని చాలామంది నిర్మాత‌లు దిగాలు ప‌డిపోతున్నారు. అయితే ఇంత క్లిష్ట‌మైన స్థితిలో కూడా కొన్ని ప్రాజెక్టులు మాత్రం మంచి రేట్లే తెచ్చుకొంటున్నాయి. ఇటీవ‌ల 'తండేల్‌' రూ.40 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఇప్పుడు...

ట్వీట్ వార్ … శశి థరూర్ వర్సెస్ బండి సంజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్, బీజేపీ నేత బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రామ మందిర నిర్మాణం, మోడీకి ఆదరణ పెంచేలా ఫ్రేమ్ లను సంజయ్ పంపిణీ చేస్తున్నారని...ఇది ఎన్నికల...

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close