13న కృష్ణా నీళ్లపై కేసీఆర్ మరిన్ని నిప్పులు..!?

తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యవసర కేబినెట్ భేటీని నిర్వహిస్తున్నారు. పదమూడో తేదీన ఈ మీటింగ్ జరగనుంది. ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలపడంతో పాటు జల వివాదంపై కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. కృష్ణా జలాల్లో సగం వాటా ఉందని వాదిస్తున్న కేసీఆర్.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 299 టీఎంసీలకు మాత్రమే అంగీకారం తెలుపుతూ సంతకాలు చేశారు.ఇప్పుడు ఇది వివాదాస్పదం అవుతోంది. దీంతో ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలన్నదిశగా కేబినెట్ తీర్మానం చేస్తారన్న ప్రచారం ఉంది. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణ బేసిన్ పరిధిలో నిర్మిస్తున్న ప్రాజెక్ట్స్ పై ఇప్పటికే కె ఆర్ ఎం బి తో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖలు రాశారు.

అంతే కాక ఎన్ జి టి తో పాటు సుప్రీంకోర్టులో కూడా తెలంగాణ కేసు వేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ అంశం రెండు రాష్ట్రాల మధ్య పరిష్కరించలేని సమస్యగా మారింది. నీటిని వాడుకోవడం, విద్యుత్ ని తయారు చేయడం పై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టతని ఇచ్చింది. క్యాబినెట్ సమావేశం లో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అనేది ఆసక్తి గా మారింది. న్యాయస్థానాల నుంచి ఎలాంటి తీర్పులు వచ్చినా.. కేంద్రం నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా.. తాము మాత్రం వెనక్కి తగ్గకూడదన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.

299 టీఎంసీలకు అంగీకరించి సంతకం పెట్టిన అంశాన్ని విపక్షాలు హైలెట్ చేస్తూండటంతో.. ముందుగా.. ఆ అంశంపై ప్రజలకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు. ఆ తర్వాత ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా కృష్ణాబోర్డుకు సమాచారం పంపాలని నిర్ణయించుకునే అవకాశం ఉంది. తెగని పంచాయతీలా మారుతున్న కృష్ణాబోర్డువ్యవహారం ఇప్పుడు… తెలంగాణ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close