సుభాష్ : జగన్‌ గెలిచే ఎంపీ సీట్లు టీఆర్ఎస్ ఖాతాలో..! కేటీఆర్ రోజూ చెబుతోంది ఇదే..!

మహబూబాబాద్, జగన్ అన్న మాటలు రెండు పక్క పక్కనే వస్తే.. రాళ్లతో జగన్‌ను టీఆర్ఎస్ కార్యకర్తలు తరిమికొట్టిన ఘటనే గుర్తుకు వస్తుంది. అలాంటి చరిత్ర ఉన్న నియోజకవర్గంలో… తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. టీఆర్ఎస్ కోసం ప్రచారం చేస్తూ.. జగన్‌ గురించి చెప్పారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గెలుస్తాడని.. ఆయన ఎంపీ సీట్లన్నీ.. కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్‌లోకి వస్తాయని… వాటితో తాము చక్రం తిప్పుతామని.. చెప్పుకొస్తున్నారు.

తెలంగాణలో జగన్ అడుగే పెట్టకూడదు.. ఏపీలో మాత్రం అధికారంలోకి రావాలా..?

తమ రాష్ట్రంలో.. అడుగు పెట్టడానికి…కనీసం ఓదార్పు చేయడానికి కూడా.. అంగీకరించని… పార్టీ తరపున కేటీఆర్ ఇప్పుడు.. జగన్మోహన్ రెడ్డి గెలుపు గురించి.. అందరికీ చెబుతున్నారు. టీఆర్ఎస్ రాళ్ల దాడులకు.. ఓదార్పు యాత్రను రద్దు చేసుకుని.. వెనక్కి వచ్చేసిన జగన్మోహన్ రెడ్డి కూడా… అదే టీఆర్ఎస్ నేతలు చెబుతున్న దాన్నే ఏపీలో చెబుతూండటం. టీఆర్ఎస్‌తో కలిస్తే తప్పేమిటని.. జగన్మోహన్ రెడ్డి.. ఓ ఎన్నికల ప్రచారసభలో .. ప్రజలను ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతల ప్రకటనలు చాలా రోజుల నుంచి.. జగన్మోహన్ రెడ్డి మీదే ఉన్నాయి. తెలంగాణలో ఉన్నది పదిహేడు సీట్లు. అందులో ఒకటి… గెలుచుకోవడం… అసాధ్యం. కాబట్టి.. అక్కడ గెలిచేవార్ని మిత్రపక్షంగా ప్రకటించుకున్నారు. ఇక పదహారు పార్లమెంట్ స్థానాలున్నాయి. 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో పదహారు సీట్లు చూపించే ప్రభావం ఎంత ఉంటుంది..?. అందుకే.. టీఆర్ఎస్ నేతలు ఈ సంఖ్యను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఇతర రాష్ట్రాల్లోని పార్టీలన్నీ.. ఢక్కామొక్కీలు తిన్న నేతల ఆధ్వర్యంలోనే ఉన్నాయి. దేవేగౌడ, స్టాలిన్ ,మమతా బెనర్జీ, పవార్,అఖిలేష్ .. ఇలా అందరూ… ఎవరి రాజకీయాలు వారు చేసుకుంటారు. ఎవరైనా.. తమ వెనుక రావాలని కోరుకునేవారు తప్ప.. తమకంటే తక్కువ రేంజ్ ఉన్న పార్టీల వెనుక నడిచేందుకు కనీసం ఆలోచన కూడా చేయరు. ఇలాంటి సమయంలో.. టీఆర్ఎస్‌కు… తన బలం రెట్టింపుగా చెప్పుకోవడానికి దొరికిన ఒకే ఒక్క ఆప్షన్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ….

వైసీపీ తరపున ఏ ఒక్క ఎంపీ గెలిచినా టీఆర్ఎస్ ఖాతాలోకేనా..?

జగన్మోహన్ రెడ్డి టీఆర్ఎస్‌కు దగ్గరయ్యారు. ఢిల్లీ లాబీయింగ్‌లు పని చేశాయో.. హైదరాబాద్‌ భేటీలు వర్కవుట్ అయ్యాయో కానీ… ఏపీలో టీడీపీని ఎదుర్కోవడానికి తానే రంగంలోకి దిగుతానని కేసీఆర్ ప్రకటించారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి.. జగన్‌కు ఆనందం కలిగించారు. జగన్ గెలుస్తారని.. 2014 ఎన్నికలకు ముందు చెప్పినట్లే.. చెప్పడం ప్రారంభించారు. అయితే నేరుగా వచ్చి ప్రచారం చేస్తే.. పరిస్థితి తేడా అవుతుందని.. వైసీపీకి తన వైపు ఎలాంటి సాయం కావాలో… అన్ని రకాల సాయం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఆ ఇన్వాల్వ్ మెంట్.. వైసీపీ వ్యవహారాల్లో కూడా ఉందని కొన్ని ఘటనలు నిరూపించాయి. డేటా చోరీ కేసు, వైఎస్ షర్మిల చేసిన ఫిర్యాదు అంశాల్లో పోలీసులను ఉపయోగించుకోవడం, అలాగే.. టీడీపీ అభ్యర్థులు కొందర్నీ.. వైసీపీలోపంపి ప్రచారం చేయించడం లాంటివి.. బహిరంగంగానే జరిగాయి. ఎలా చూసినా.. ఇప్పుడు… వైసీపీ, టీఆర్ఎస్ పార్టనర్స్. ఇందులో దాపరికం లేదు. కేటీఆర్, జగన్ ఇద్దరూ నేరుగానే చెబుతున్నారు. అంటే.. ఏపీలో గెలిచే వైసీపీ ఎంపీలను… టీఆర్ఎస్ తన బలంగా చూపించుకుని.. ఢిల్లీలో చక్రం తిప్పాలనుకుంటోంది.

కేటీఆర్ మాటలను.. జగన్ ఎందుకు ఖండించలేకపోతున్నారు..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్క ప్రకారం చూసుకుంటే.. ఉన్న 42 సీట్లు. దేశం మొత్తం ఉన్న సీట్లతో పోల్చుకుంటే.. 8 శాతంలోపే ఉంటాయి..!. వీటిలో తెలంగాణ వాటా 17. ఏపీ ఎంపీ సీట్లను అడ్డం పెట్టుకుని.. చక్రం తిప్పాలనుకుంటుంటున్నారు. దీని వల్ల… టీఆర్ఎస్‌కు లాభం చేకూరుతోంది. మరి వైసీపీకి అని ఆలోచిస్తే చెప్పలేని పరిస్థితి. అలా అని.. జగన్మోహన్ రెడ్డి టీఆర్ఎస్‌తో దోస్తీని ఖండించే ప రిస్థితి లేదు. ఖండించలేని స్థితిలో జగన్ ఉండటంతో… ఏపీ ప్రజల్లో ఎలాంటి సెంటిమెంట్ పెరిగినప్పటికీ… తమ సీట్లు తమకు ముఖ్యం అన్నట్లుగా.. టీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో వస్తున్నాయి. ఏది ఏమైనా.. వైసీపీ, టీఆర్ఎస్ పార్టనర్లు అనే విషయాన్ని విడివిడిగా అయినా కేటీఆర్, జగన్… అంగీకరించినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close