ట్వంటీ20 స్పెషల్ : ఏపీ ఆర్థికవృద్ధికి కావాలొక జగన్ మార్క్ “ఐడియా”..!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది. ప్రభుత్వం లెక్కలు చెప్పకపోయినప్పటికీ.. జీతాల కోసం.. కూడా నెలాఖరులో అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఆర్థిక ఎమర్జెన్సీ అనే పదం.. ఏపీలో ఇప్పుడు తరచూ వినిపిస్తోంది. దీనికి కారణం.. లోటు బడ్జెట్‌తో ప్రారంభమైన రాష్ట్రంలో… ముందూ వెనుకా చూసుకోకుండా.. సంక్షేమ పథకాలకు వేల కోట్లు.. వెచ్చించడమే. ఎక్కడ అప్పులు దొరికితే.. అక్కడ అప్పులు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో.. సీఎం జగన్మోహన్ రెడ్డి.. నవరత్నాలను పూర్తి స్థాయిలో ఈ ఏడాదే అమలు చేయాల్సి ఉంటుంది. అరవై లక్షల మంది తల్లులకు .. జనవరి తొమ్మిదో తేదీన పదిహేను వేలు ఎకౌంట్‌లో వేయడం ప్రారంభించి.. ఉచిత ఇళ్ల స్థలాలు, డ్వాక్రా రుణాల మాఫీ, అరవై ఏళ్లకే పెన్షన్, వృద్ధాప్య పెన్షన్లను మరో 250 పెంచడం.. దగ్గర్నుంచి ప్రతీ నవరత్నాన్ని మళ్లీ ఈ ఏడాది అమలు చేయాల్సి ఉంది. ఇవన్నీ అమలు చేయడానికి కనీసం లక్ష కోట్ల రూపాయలు కావాలి. కానీ ఏపీ.. ఈ ఏడాది మొదటి ఆరు నెలలకే .. పాతిక వేల కోట్ల లోటు బడ్జెట్‌లో ఉంది. ఆదాయానికి ఖర్చుకు పొంతన లేకుండా పోయింది.

ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా.. వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు.. ఇలా అందరికీ కలిపి.. ప్రభుత్వానికి జీతాల బిల్లు నెలకు దాదాపుగా పది వేల కోట్లకు చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఏ విధంగా చూసినా.. ఆంధ్రప్రదేశ్ మరో అర్జెంటీనా అయిపోతుందన్న ఆందోళన చాలా మందిలో కనిపిస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను అడిగే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఇస్తామన్నా.. నిబంధనలు పాటించడం లేదు కూడా. ఉపాధి హామీ నిధులు రూ. పదివేల కోట్లు వాడుకునే చాన్స్ ఉన్నా.. ఇప్పటికి రూ. ఐదు వేల కోట్లతోనే సరి పెట్టారు. పోలవరానికి పైసా రాలేదు. అడగలేదు. వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సినవి ఇవ్వలేదు. అడగలేదు. ఈ లెక్కన కేంద్రం నుంచి రూపాయి కూడా రాదు. పైగా ఈ ఏడాది.. ఆర్థిక సంఘం రాష్ట్రాలకు నిధులను తగ్గించడం ఖాయంగా కనిపిస్తోందంటున్నారు.

అయితే ఏపీ ప్రజల ఆశలన్నీ యువ సీఎం జగన్ మీదే ఉన్నాయి. తన ఆర్థిక పరమైన తెలివి తేటలతో.. శూన్యం నుంచి మహా వ్యాపార సామ్రాజ్యాన్ని పుట్టించిన గొప్ప వ్యాపారవేత్త జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో.. తన ఐడియాలతోనే ఇంత గొప్ప సక్సెస్ సాధించానని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన తన తిరుగులేని.. కుబేర వ్యాపారవేత్తగా ఎదిగిన ఐడియాలతోనే.. .. ఏపీని కూడా… తిరుగులేని ఆర్థిక శక్తిగా నిలుపుతారన్న భావన ప్రజల్లో ఉంది. ఈ ఏడాది ఆయన దీన్ని నిజం చేసి చూపించాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close