2024లో ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీకి చెందిన కొంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా మంది దివాలా తీశారు. దీనికి కారణం బెట్టింగ్. జగన్ రెడ్డి వై నాట్ 175 అంటూ అందర్నీ నమ్మించారు. చివరికి పోలింగ్ ముగిసిన తర్వాత ఫీడ్ బ్యాక్ తెలుసుకుని కూడా గెలుస్తున్నాం అంటూ ఐ ప్యాక్ ఆఫీసుకు వెళ్లారు.. ఆరా మస్తాన్ అనే వ్యక్తితో సర్వేలు రిలీజ్ చేయించుకున్నారు. జగన్ రెడ్డిని నమ్ముకుని వేల మంది వైసీపీ కార్యకర్తలు బెట్టింగులు కాసి సర్వం కోల్పోయారు. వారి కోసం జగన్ రెడ్డి చిన్న సాయం కూడా చేయలేదు.
క్యాడర్ నిలదీస్తారనే కార్యకర్తలతో భేటీలు రద్దు
జగన్ రెడ్డి కొద్ది రోజుల కిందట.. తాను జిల్లాలలో పర్యటిస్తానని క్యాడర్ తో సమావేశం అవుతానని ప్రకటించారు. కానీ ఆయన ఆ తర్వాత మాట మార్చారు. క్యాడర్ తో సమావేశాలను రద్దు చేసుకున్నారు. ప్రతీ చోటా ఈ బెట్టింగ్ బాధితులు నిలదీస్తారన్న సమాచారం ఉండటంతోనే ఆయన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఇప్పటికే గతంలో ఒకటి, రెండు చోట్ల క్యాడర్ ను కలిస్తే..వారిలో ఎక్కువ మంది బెట్టింగ్ వల్ల నష్టపోయామని ఆదుకోవాలని కోరారు. కానీ జగన్ లో చలనం లేదు.
తప్పుడు ప్రచారాలతో క్యాడర్ ను మిస్లీడ్ చేసిన జగన్
తప్పుడు సర్వేలు, ప్రచారాలతో క్యాడర్ ను జగన్ మిస్ లీగ్ చేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే సర్వేలను సోషల్ మీడియాలో ప్రచారం చేసి.. క్యాడర్ ను నమ్మించే ప్రయత్నం చేశారు. జగన్ ను గుడ్డిగా నమ్మిన వారు.. అడ్డంగా బలైపోయారు. జగన్ తీరు ఎలా ఉంటుందంటే.. ప్రజాభిప్రాయం అనుకూలంగా లేకపోయినా ఏదో ఒకటి చేసి గెలుగుస్తారని నమ్మకం కలిగించారు. కానీ జగన్ రెడ్డి రాజ్యాంగానికి, వ్యవస్థల కంటే పెద్దవాడు కాదని ప్రజలు తీర్పు ఇచ్చారు.
టీడీపీ వేధింపుల పేరుతో నాటకాలు
బెట్టింగుల్లో నష్టపోయి ప్రాణాలు తీసుకున్న వారితో ఇప్పుడు జగన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు. టీడీపీ వేధింపుల వల్ల చనిపోయారంటూ.. విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందుగా జగన్ రెడ్డి మిస్ లీడ్ చేయడం వల్ల నష్టపోయిన బెట్టింగ్ బాధితులకు న్యాయం చేయాలన్న డిమాండ్లు వైసీపీలోనే వినిపిస్తున్నాయి. కానీ జగన్ రెడ్డి రూపాయి కూడా ఇవ్వరు. కానీ ఆయా కుటుంబాలతో రాజకీయం మాత్రం చేస్తారు. ఆ కుటుంబాలను బలి చేయడానికి రెడీగా ఉంటారు.