పవన్‌ను వీక్ చేసేందుకు బీఆర్ఎస్‌ కుట్ర – వీర్రాజు పాత్ర ఉందంటున్న కన్నా !

ఏపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన కొంత మంది నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరడం చర్చనీయాంశమవుతోంది. వారిని ఎవరు ఆ పార్టీలో చేర్పించారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే వారిని సోము వీర్రాజే బీఆర్ఎస్‌లో చేర్పించారన్న అనుమానాలను కన్నా లక్ష్మినారాయణ వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన వారిలో సోము వీర్రాజు వియ్యంకుడు ఉన్నారని.. ఆయన ఎందుకు బీఆర్ఎస్‌లో చేరారో చెప్పాలంటున్నారు. కన్నా వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సోము వీర్రాజే నేతల్ని బీఆర్ఎస్‌లోకి చేరేలా మోటివేట్ చేశారన్న అభిప్రాయం బీజేపీలో వినిపిస్తోంది.

జగన్ – కేసీఆర్ కుట్రలో భాగంగానే బీఆర్ఎస్‌లోకి ఏపీ నేతలు వెళ్లారని కన్నా అనుమానం వ్యక్తం చేశారు. ఆంధ్రాలో పవన్ , తెలంగాణ లో బండి సంజయ్‌ ను వీక్ చేసే కుట్ర జగన్, కేసీఆర్‌లు కలిసి చేస్తున్నారు. ఒన్ షాట్ టూ బర్డ్స్‌గా కాపు నేతలపై బీఆర్ఎస్ దృష్టి పెట్టిందన్నారు. పవన్‌కు మేమంతా అండగా ఉంటాం. కాపులపై ఈ మధ్య కాలంలో మీడియా దుష్ప్రచారం చేస్తోంది అంటూ కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేశారు. జీవీఎల్ పైనా విమర్శలు చేశారు. ఎంపీ జీవీఎల్ ఆలోచన స్థానిక బీజేపీ కార్యకర్తల అభిప్రాయాలకు ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. అమరావతి రాజధాని సహా అనేక అంశాలలో జీవీఎల్ వైఖరి చూశామని గుర్తు చేశారు.

సోము వీర్రాజు ఇటీవల కన్నా లక్ష్మినారాయణ అనుచరుల్ని జిల్లా అధ్యక్ష పదవుల నుంచి తొలగిస్తున్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నియమించిన వారిని ఇప్పుడు తొలగిస్తూ ఉండటంపై కన్నా మండిపడ్డారు. కోర్ కమిటీలో చర్చించకుండా జిల్లా అధ్యక్షుల్ని ఎలా మారుస్తారని ప్రశ్నిస్తున్నారు. కన్నా వ్యవహారం బీజేపీలో మరోసారి కలకలం రేపుతోంది. కన్నా లక్ష్మినారాయణ ఇటీవలి కాలంలో పార్టీపై.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై అసంతృప్తి వ్యక్తం చేయడం రెండో సారి. ఆయన కొద్ది రోజుల కిందట పార్టీ మారుతారన్న ప్రచారం జరిగింది. కానీ పార్టీ హైకమాండ్ ఫోన్ చేసి.. బహిరంగంగా మాట్లాడవద్దని సూచించడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మళ్లీ విమర్శలు అందుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close