సాగర్‌కు వరాలు.. ఉపఎన్నికపై కేసీఆర్ కసరత్తు..!

ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మరో ఉపఎన్నిక గండం వచ్చి పడింది. ఇప్పటికే దుబ్బాక… గ్రేటర్ ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగలడంతో ఈ సారి సాగర్‌ ఆయనకు మరింత టెన్షన్ తీసుకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. టీఆర్ఎస్‌ నిజానికి సాగర్‌లో బలంగా లేదు. ఒక్క సారే గెలిచింది. అక్కడ బలమైన నేతగా జానారెడ్డి ఉన్నారు. ఆయనను బీజేపీ ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. దీంతో కేసీఆర్.. ముందస్తు కసరత్తు ప్రారంభించేశారు. నాగార్జునసాగర్‌కు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రారంభించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో డిగ్రీ కాలేజీ పెడతామని చాలా కాలంగా టీఆర్ఎస్ హామీ ఇస్తూ వస్తోంది. ఇప్పుడు ఏర్పాటుచేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అలాగే మూసీ నదిపై కేశవాపురం వద్ద కొండ్రపోల్‌ ఎత్తిపోతల పథకానికి రూ.75.93 కోట్లు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే సాగర్‌ ఎగువన ఉన్న నెల్లికల్‌ ఎత్తిపోతల పథకానికీ అనుమతినిచ్చారు. వాడపల్లి ఎత్తిపోతల పథకం రూ.229.25 కోట్లతో నిర్మాణం చేస్తారు. అలాగే చిన్న చిన్న పనులకు సంబంధించిన జీవోలను కూడావిడుదల చేశారు. ఈ ప్రాజెక్టులు, పథకాలన్నీ కూడా నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి ప్రయోజనం చేకూర్చేవే. కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్లుగా అక్కడి నేతలు.. గ్రామ గ్రామన కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేస్తున్నారు.

అయితే.. ఈ జీవోలన్నీ… ఎన్నికలు జరిగేలోపు నిధులుగా మారి.. పనులు జరిగితేనే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. లేకపోతే… ఎన్నికల్లో మళ్లీ ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని… రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే.. ఉపఎన్నికల్లో గెలిచిన హుజూర్ నగర్‌కు కేసీఆర్ పెద్ద ఎత్తున ప్యాకేజీ ప్రకటించారు.కానీ వాటికి సంబంధించి.. ఏమైనా నిధులు వచ్చాయా లేదా అన్నదానిపై స్పష్టతే లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేజూ సిక్స్ ప్యాక్‌

సాయిధ‌ర‌మ్ తేజ్ ఈమ‌ధ్య బాగా బొద్దు చేశాడు. రోడ్డు ప్ర‌మాదం త‌ర‌వాత ఫిజిక్‌ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దాంతో స‌హజంగానే లావ‌య్యాడు. `బ్రో` సినిమాకి ముందు కాస్త త‌గ్గాడు. అయితే ఆ త‌ర‌వాతి సినిమాకి...

గన్నవరం ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు ?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎయిర్ పోర్టుల పేరు మార్పు ప్రతిపాదనలను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. విజయవాడ, తిరుపతి, కర్నూలు ఎయిర్ పోర్టుల పేర్లను మార్చాలని సిఫారసు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన...

లిక్కర్ వాసుదెవరెడ్డిని దేశం దాటించేశారా ?

ఏపీ లిక్కర్ స్కాంలో అత్యంత కీలకమైన వ్యక్తి వాసుదేవరెడ్డి. ఆయన ఇప్పుడు ఆచూకీ లేరు. ఆయన కోసం ఏపీ ప్రభుత్వం లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఆయనపై రెండు...

బ్యాక్ టు బెంగళూరు

వైఎస్ జగన్ మళ్లీ సతీసమేతంగా బెంగళూరు వెళ్లిపోయారు. మళ్లీ ఏదైనా హత్య లేదా మృతదేహం రాజకీయం చేయడానికి ఉపయోగపడుతుందనుకుంటే వస్తారేమో కానీ.. ఎప్పుడొస్తారో తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వినుకొండలో రషీద్ అనే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close