మళ్లీ లాక్ డౌన్ కొనసాగింపునకు కేసీఆర్ మొగ్గు..!?

లాక్‌డౌన్‌ను మరింత కాలం పొడిగించాలనే ఆలోచనలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆదివారం అధికారులతో జరిగిన సమావేశంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. నేడు… ప్రధానమంత్రి మోడీతో ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ జరగనుంది. అందులో.. అందరి ముఖ్యమంత్రులు.. తమ తమ అభిప్రాయాలు వెలిబుచ్చనున్నారు. ప్రధానికి ఏం చెప్పాలన్నదానిపై.. అధికారులు, మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతూ వస్తూండటంపై.. సంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా పట్టు విడువలకుండా.. కోరనాను పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసే వరకూ లాక్ డౌన్ కొనసాగిస్తే.. తెలంగాణ ప్రమాదం నుంచి బయటపడుతుందనే అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నారు..

తెలంగాణలో సంపూర్ణ లాక్ డౌన్‌ను కేసీఆర్ మే ఏడో తేదీ వరకు పొడిగించారు. ప్రధానమంత్రి మోడీ మే మూడో తేదీ వరకే లాక్ డౌన్ ప్రకటించారు. ఇరవయ్యో తేదీ నుంచి కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఆ తర్వాత దుకాణాలు తెరుచుకోవడానికి కూడా కేంద్ర హోంశాఖ పర్మిషన్ ఇచ్చింది. కానీ కేసీఆర్ మాత్రం.. వాటిని అమలు చేయడానికి ఇష్టపడలేదు. తమ విధానం ప్రకారం… రాత్రి పూట కర్ఫ్యూ కొనాసగిస్తున్నారు. ఉదయం పూట లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. ఇప్పుడు కేసులు తగ్గుముఖం పడుతూండటంతో… మరింత జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నారు.

హాట్ స్పాట్లు, కంటెన్మెంట్ జోన్ల వారీగా…. ప్రత్యేక జాగ్రత్తలను తెలంగాణ సర్కార్ తీసుకుంటోంది. క్వారంటైన్ సమయాన్ని 28 రోజులకు పెంచింది. 14 రోజుల క్వారంటైన్ పూర్తయి ఇళ్లకు వెళ్లిన తర్వాత 28 రోజులకూ లక్షణాలు బయటపడుతూండటంతో.. ఈ ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. వైరస్ అత్యంత ప్రమాదకరమైనదని.. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదన్న భావనలో కేసీఆర్ ఉన్నారు. లాక్ డౌన్ పొడిగింపుపై కేంద్రం ఆలోచనలేమిటో తెలుసుకున్న తర్వాత.. దానికి తగ్గట్లుగా కేసీఆర్ నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close